–వచ్చే సోమవారం నుండి జిల్లా స్థాయి తరహాలోనే మండల స్థాయిలో ప్రజావాణి
–మండల స్థాయిలో పాలనను పటిష్టం చేసేందుకు ప్రణాళిక
–ప్రజల అన్ని రకాల సమస్యలను తీర్చేందుకు ముందుదాం
–బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపు
Revenue Meeting: ప్రజా దీవెన నల్లగొండ: ప్రజల సమ స్యలను పరిష్కరించడంలో అధికా రులు, సిబ్బంది అందరూ కలిసి ఒక బృందంగా పనిచేద్దామని నూతన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (C. Narayana Reddy) అన్నారు. మంగళవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ (Revenue officers) అధికారులతో సమావేశం అయ్యారు రెవెన్యూ అంశాలతో పాటు, ప్రజ లకు సంబంధించిన అన్ని సమస్య లను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపించాలని అన్నారు .ప్రజల సమస్యల పరిష్కా రంలో వారికి నమ్మకాన్ని, భరోసాను కల్పించా ల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేకించి పెండింగ్ లో ఉన్న ధరణి (Dharani) దరఖాస్తులన్నింటిని రానున్న 15 రోజుల్లో పరిష్కరిం చాలని ఆదేశించారు. ఇందుకుగా ను మండల స్థాయి నుంచి మొద లుకొని జిల్లా స్థాయి వరకు అధికా రులు సిబ్బంది ఒక బృందంగా పని చేద్దామని చెప్పారు. ప్రజా సమ స్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రజా వాణి కార్య క్రమం నిర్వహించినట్లు గానే , ఇకపై మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి (public voice) కార్య క్రమం నిర్వహించ డం జరుగు తుందని , వచ్చే సోమ వారం నుండి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారం భించడం జరుగుతుందని, ఇందు కుగాను మండల స్థాయిలో అవస రమైన అన్ని మౌలిక వసతు లను కల్పించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రతి సోమవారం పూర్తిగా ప్రజలకు కేటా యించాలని, ప్రజావాణిలో రెవె న్యూ, సంక్షేమ, అభివృద్ధి, ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాల ని,ఇందుకు అవసరమైతే పంచా యతీ కార్యద ర్శుల సేవలను తీసుకోవాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కా రంలో భాగంగా పరిష్కా రమయ్యే వాటిని వెంటనే పరిష్కరించడం, కాని వాటికి ఒక దారి చూపించడం చేయాలని, నల్గొండ (Nalgonda) జిల్లాలో ప్రజావాణి కార్య క్రమం అద్భుతంగా జరిగేలా సహక రించాలని కోరారు. ప్రజావాణి కార్య క్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని, ఎవరు గైర్హాజరు కాకూడదని అన్నారు.రెవెన్యూ అధికారులు ధరణి దరఖాస్తుల పరిష్కారం పై ముందుగా దృష్టి సారించాలని, ప్రత్యేకించి భూము లకు సంబంధించి పొజిషన్లో ఉన్న రైతులు, టైటిల్ పరిశీలన, ప్రభుత్వ ప్రాధాన్యత, న్యాయపరమైన వివా దాల వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలని, ఒకవేళ ఏదైనా దరఖాస్తు తిరస్కరించాల్సి వస్తే ఎందుకు తీరస్కరిస్తున్నామో స్పష్టం గా తెలియజేయాలని ,ధరణికి సంబంధించిన రికార్డులు అన్నిటిని జాగ్రత్తగా నిర్వహించాలని, జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని ధరణి దర ఖాస్తులను 15 రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా పునరుద్ఘాటిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధరణికి సంబం ధించి జిఎల్ఎం, కోర్టు కేసులు, జిపిఏ ,నాలా, సక్సెస న్, మిస్సింగ్ సర్వే నంబర్ ,టిఎం- 33 తదిత రఅన్ని అంశాలపై రెవె న్యూ అధికా రులకు సూచనలు ఇచ్చారు. ఆర్డీ వోలు వారి డివి జన్ కు సంబంధించి పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని, వారి లాగిన్ లో ఉన్న అన్ని పిటీష న్లను పెండింగ్ లో ఉంచుకోవద్దని తెలిపారు. తక్షణమే మీసేవ ఆప రేటర్లతో సమావేశం నిర్వహించి మరోసారి ధరణిపై శిక్షణ ఇవ్వాలని, పూర్తిస్థాయిలో దరఖాస్తులను పరి శీలించాకే మీసేవ ఆపరేటర్లు పోర్టల్ లో అప్లోడ్ చేసే విధంగా వారికి సూచనలు జారీ చేయాలని, తప్పుగా అప్లోడ్ చేయకూడదని అన్నారు. భూముల సర్వే కి సంబంధించి సర్వేయర్లు జాగ్రత్తగా సర్వే పనులు నిర్వహించాలని, ఎక్కడ తప్పు చేయొద్దని చెప్పారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ,మిర్యాలగూడ, దేవరకొండ ఆర్డీవోలు రవి, శ్రీనివాసరావు ,శ్రీరాములు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి శ్రీనివాసులు, అన్ని మండలాల తహసిల్దారులు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్, ఆయా విభాగాల పర్యవేక్షకులు, ఈ రెవెన్యూ అధికారుల సమావేశానికి హాజరయ్యారు.