Road Accident : ప్రజా దీవెన, ఏలూరు: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాలీ లారీని (Trolley lorry)ఎర్టిగా కారు (car) వెను క వైపు నుంచి బలంగా ఢీకొ నడoతో ప్రమాదంలో ఘటనా స్థలం లోనే ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృత్యువాత పడ్డారు.
తీవ్రంగా గాయపడిన డ్రైవర్ (driver)మరో బాలుడిని ఆశ్రమ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంలో మరణించిన మృతులు హైదరాబా దు వాసులుగా గుర్తించారు. హైదరా బాద్ నుంచి రాజవోలు వెళుతుం డగా లక్ష్మీ నగర్ వద్ద ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సందర్శించారు. గాయపడిన డ్రైవర్(driver) వాడపల్లికి చెందిన దుర్గా వంశీగా గుర్తించారు.