–ప్రమాదస్థలిలోనే ముగ్గురు మృతి
Road Accident: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలోని (Telangana) మేడ్చల్ జిల్లా షామీర్ పేట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో ముగ్గురు ప్రమాద స్థలి లోనే దుర్మరణం (died) పాలయ్యారు. ఓ కారు అతి వేగంగా ప్రయాణిస్తూ అ దుపు తప్పి డివైడర్ అవతలి వైపు పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో (accidents)ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉం డగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే (Very fast)ప్రమా దానికి కారణమని స్థానికులు తెలి పారు. మజీద్ పురా చౌరస్తాలో కారు అతివేగంగా దూసుకొచ్చి పల్టీ కొట్టింది. పక్కనే రోడ్డుపై ఉన్న ప్రైవే ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీం తో ఇన్నోవా కారులోని ముగ్గురు మరణించగా మరో ఇద్దరికి గాయా లయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు (police)ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై నుంచి బస్సు, ఇన్నోవాకారును పక్కకు తొలగించారు. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు బస్సును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు తెలు స్తోంది. చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘట నపై కేసు నమోదు (Registration of case) చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.