Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident : బస్సు లోయలో పడి ఐదుగురి దుర్మరణం

Road Accident : ప్రజా దీవెన, గుజరాత్: గాంధీనగర్ గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్ల వారుజామున ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిన దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు.మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యా యి. ఈ ఘటన డాంగ్ జిల్లాలోని సపుతరా హిల్ స్టేషన్ పరిధిలో జరిగింది.

 

ప్రయాణికులంతా మహా రాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకకు వస్తుండం గా ఈ ప్రమాదం జరిగినట్లు సమా చారం.సమాచారం అందుకున్న పో లీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రి కి తరలించారు.ఆదివారం తెల్లవా రుజామున 4:30 గంటల సమ యంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా ఎస్పీ ఎస్జీ పాటిల్ తెలిపారు.

 

“తెల్లవారుజామున రోడ్డును పూ ర్తిగా మంచు కప్పేసింది. దీంతో బ స్సు అదుపుతప్పి 35 అడుగుల లోతులో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బ స్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని వివరించారు. ఈ ఘట నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంద ని అన్నారు.