Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident : ఉక్కు స్తంభాల కింద వలస బతుకులు చిద్రం

–కంటెయినర్‌ పల్టీకొట్టగా దాని కింద రెండు ఆటోలు

–ఉక్కు స్తంభాల కిందపడి నలుగు రి దుర్మరణం, మరో నలుగురికి తీ వ్రగాయాలు

Road Accident :

ప్రజా దీవెన, వరంగల్‌: వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అది కూడా ఎవరు ఊహించనిది కన్ను తెరిచి కళ్ళు మూసే లోపే పద్దెనిమిది టైర్ల భారీ కంటెయినర్‌ కింద వలస బతుకులు చిద్రమ య్యాయి. పెద్ద పెద్ద ఉక్కు స్తంభాల లోడ్‌తో వెళుతోన్న లారీ డ్రైవర్ పూటుగా మద్యం తాగి, ఆ మత్తు లో నడపడంతో ఈ ప్రమాదం సంభ వించింది. అతడి ఈ నిర్లక్ష్య మే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణ మైంది ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది. మద్యం మత్తులో జోగుతున్న డ్రైవర్‌, కంటెయినర్‌పై నియంత్రణ కోల్పోవడంతో అది అ దుపు తప్పి పల్టీకొట్టింది.ఆలోపు అందులోని ఉక్కు స్తంభాలు పక్క నుంచే వెళుతున్న రెండు ఆటోలపై పిడుగుల్లా పడ్డాయి. ఆ ఆటోల్లో ప్రయాణిస్తున్నవారు చీమల్లా నలిగి పోయారు. ప్రమాదంలో తండ్రి, ఇద్ద రు కుమార్తెలు, కుమారుడు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగు రు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇంటి పెద్ద భార్య, మరో కుమా రుడు చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై మా మునూ రు పోలీసు పెట్రోలు బంకు వద్ద ఆదివారం ఉదయం సంభవించిం ది.

 

 

 

రోడ్డంతా నెత్తురు, ఛిద్రమైన శరీర భాగాలతో ఒళ్లు జలదరించే లా అక్కడ భీతావహంగా మారిం ది. మృతులు, క్షతగాత్రులంతా మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన వలస జీవులు వంట కోసం ఉపయోగించే కత్తిపీటలు, కత్తులు తయారు చేసి, అమ్ముకొని పొట్టపోసుకునే బడుగు జీవులు మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని లలితానగర్‌ ప్రాం తానికి చెందిన లోపిట సంతోష్‌ చౌహాన్‌ (48).. భార్య చామా బాయి (40), కుమారు లు ముకేశ్‌ చౌహాన్‌, కన్నా చౌహాన్‌ (7), కూతుళ్లు ఆర్తి చౌహాన్‌ (20), కిరణ్‌ చౌహాన్‌ (12)తో కలిసి తొమ్మిదినెలల క్రితం వరంగల్‌ శివారులోని మామునూరుకొ చ్చారు. ఆయన కుటుంబంతో పాటు భోపాల్‌ నుంచి మరో ఆరు కుటుంబాలు వలసొచ్చాయి. వీరం తా తాము తయారు చేస్తున్న వస్తు వులను వరంగల్‌కు తీసుకెళ్లి అమ్ముతుంటారు. ఆదివారం సంతోష్‌ చౌహాన్‌, ఆయన కుటుం బసభ్యులంతా ఒకే ఆటోలో మా మునూరు నుంచి వరంగల్‌కు బయలుదేరారు.

 

 

ఇక కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోట ప్రాంతానికి చెంది న మరో ఆటో ఐనవోలు నుంచి వ రంగల్‌ వైపు వెళుతోంది. ఈ రెండు ఆటోలు మామునూరు పెట్రోలుబం కు వద్ద ఘోర ప్రమాదానికి గుర య్యాయి. విశాఖపట్టణం నుంచి వరంగల్‌ వైపు భారీ ఉక్కు స్తంభాల లోడుతో వెళుతున్న కంటెయినర్‌ అదుపు తప్పి పడిపోయింది. అందులోని స్తంభాలన్నీ నేరుగా రెండు ఆటోలపై పడ్డాయి. ఈ ఘటనలో సంతోష్‌, ఆర్తి, కిరణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. సంతోష్‌ భార్య చామాబాయి, కుమారులు కన్నా చౌహాన్‌, ముకేశ్‌తో పాటు మరో ఆటోలోని డ్రైవర్‌ రాపర్తి సాగర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నా చౌహాన్‌ ప్రాణాలొదిలాడు. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలి పారు. గాయపడ్డ వారిని తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వరంగల్‌ కలెక్టర్‌, పోలీసు అధికారు లకు ఆదేశాలు జారీచేశారు.

 

మిన్నంటిన క్షతగాత్రుల రోదన లు.. మృతులు, క్షతగాత్రుల సం బంధీకుల రోదనలతో ఎంజీఎం ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలు ముకున్నాయి. మిగతా రోగుల బం ధువులు వారికి భోజనం అందించ బోగా వారు తీసుకోలేదు. ‘మేం ఎలా తినగలం మా నోట్లోకి మం చినీళ్లు కూడా పోవడం లేదు. మా సొంతూరికి పంపిస్తే వెళ్లిపోతామ ని చేతులు జోడిస్తూ విలపించారు. ఆస్పత్రి వద్ద మృతుల సంబంధీకు లను మంత్రి కొండా సురేఖ పరామ ర్శించారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించాలని అధి కారులను ఆదేశించారు. కాగా, ఎం జీఎంలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తర లించి నట్లు అధికారులు పేర్కొ న్నారు.