Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

–ముగ్గురు యువకులు మృతి

Road Accident:ప్రజా దీవెన, సంగారెడ్డి: సంగారెడ్డి (Sangareddy)జిల్లాలో లారీని బైక్ ఢీ (lorry bike) కొట్టిన సంఘటనలో యువకులు దుర్మ రణం పాలయ్యారు. ఈ విషాద దుర్ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని తునికీళ్లతండా వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకుంది. పుల్క ల్ మండలం గంగోజిపేట, కొలుకూ రు గ్రామాలకు చెందిన అభిషే క్(21), సందీప్ (20), నవీన్(20) కంది మండల కేంద్రంలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ లో (Akshaya Patra Foundation) పనిచేస్తు న్నారు. ఉదయం ముగ్గురు డ్యూటీ (Three on duty) కి నిమిత్తం హాజరయ్యేందుకు ఒకే బైకీపై పుల్కల్ నుంచి కంది వైపు వస్తున్నారు. ఈ క్రమంలో తునికిళ్ల తండా వద్ద వారి బైక్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే సంఘటన స్థలంలోని ప్రాణాలు వదిలారు. పోలీసులు మృత దేహాలను పోస్ట్మర్టానికి తర లించారు. దీంతో సంగారెడ్డి ప్రభు త్వ ఆస్పత్రి మార్చురీ వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటా యి.