Road Accident : ప్రజా దీవెన, సూర్యపేట: సూర్యా పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుం బానికి చెందిన ముగ్గు రు ఘటనా స్థలిలోనే మృత్యువాత పడ్డారు. చివ్వెం మండలం బీబీ గూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకు న్న ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారి ఎనిమిదేళ్ల కూతు రు ప్రాణాలు కోల్పోయింది. మృ తులను మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్, రేణుక, రితికగా గుర్తించారు. ఘట నపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ప్రమాదానికి గురైన వారు ఆత్మకూరు (S) మండలం కోట పహాడ్ గ్రామంలో పం డుగకు హాజరై హైదరాబాద్ తిరిగి వెళ్లుచుండగా బీబీగూడెం గ్రామ శివారులో గల విజేత పైపుల కంపెనీ ముందు ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సుని డీ కొట్టగా ఈ ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కాంటెయ్యపాలెంకి చెంది న గడ్డం రవీందర్ (34) అతని భార్య రేణుక (28), వారి కూతురు రిషిత(8) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో మొత్తం ఏడు గురు ఉన్నట్టు గుర్తించారు.
పోలీసులు. నలుగురు పిల్లల పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వా సుపత్రికి తరలింపు. మృతుడు రవీందర్ హైదరాబాద్ లో నివాసం ఉంటూ కార్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.