బిగ్ బ్రేకింగ్, రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి దుర్మరణం
RoadAccident: ప్రజా దీవెన హైదరాబాద్: విధి వక్రీ కరించిదం టే ఇదేనేమో అనిపి స్తుంది. శనివారం హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన ఇం దుకు నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని అదనపు డీసీపీ బాబ్జీ దుర్మరణం పా లయ్యారు.
లక్ష్మా రెడ్డి పాలెం సమీపంలో మార్నింగ్ వాకింగ్ చేస్తుం డగా ఏపీఏస్ ఆర్టీసీ బస్సు ఢీకొ ట్టడంతో అదనపు డీసీపీ బాబ్జీ ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. అదనపు డీసీపీ బాబ్జీ ప్రస్తుతం తెలంగాణ డీజీపీ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఉదయం లక్ష్మారెడ్డిపాలెంలో వాకింగ్ చేస్తున్నక్రమంలో ఈ రోడ్డు దా టుతుండగా ఏపీఎస్ఆర్టీకి చెందిన బస్సు ఆయనను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
లక్ష్మారెడ్డిపాలెంలోని మైత్రి కుటీర్లో బాబ్జీ నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు అదనపు డీసీపీగా ప్రమోషన్ వ చ్చింది. ప్రస్తుతం ఆయన రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూ మ్ లో అడిషనల్ ఎస్పీగా విధులుగా నిర్వహిస్తున్నారు. మరో మూడు రోజు ల్లో డీజీపీ ఆఫీస్లో రిపోర్టు చేయాల్సి ఉన్నది. ఇంతలోనే రోడ్డు ప్ర మాదంలో మరణించడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొ న్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు.