ఘోర ప్రమాదం, నీట్ పరీక్ష రాసేందుకు వెళ్తూ అనంతలోకాలకు
RoadAccident: ప్రజా దీవెన, జైపూర్: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీ ట్ (యూజీ) పరీక్ష రాసేందుకు వె ళ్తుం డగా విషాదం చోటుచేసుకుం ది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు నీట్ అ భ్యర్థులు ఉండగా వారితో పాటు ఉన్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పో యారు. రాజస్థాన్లోని జైపుర్ జి ల్లాలో జరిగిన ఈ ఘటన పెను వి షాదం రేపింది.
ఇద్దరు విద్యార్థినులు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై నీట్ పరీక్ష రాసేందుకు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ఓ వం తెన వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతు లను ఖుషి శర్మ (21), ప్రియా శర్మ (22)గా గుర్తించారు. వీరిద్దరూ బ స్సీ పట్టణం సమీపంలోని ఓ గ్రా మానికి చెందినవారని తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రక్కు డ్రైవర్ అక్క డి నుంచి పరారయ్యాడు. కేసు న మోదు చేసుకున్న పోలీసులు ద ర్యాప్తు చేస్తున్నారు.