RTC : ప్రజా దీవేన, కోదాడ: కోదాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిపో డిఎం బి శ్రీనివాసరావు బుధవారం ప్రయాణికులతో అభిప్రాయాలను సేకరించారు.
ప్రయాణికులుఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు? మీరు ప్రతి నెల ఎన్నిసార్లు బస్సులో ప్రయాణిస్తారు? ఏ ఏరూట్లో బస్సుల కొరత ఉందా? ఎలాంటి రకమైన బస్సులు కావాలి? ఏ సమయానికి కావాలి? బస్సు పాసులు కావాలంటే ఏ పద్ధతిలో కావాలి? ఇలా పలు రకాల అంశాలతో చరవాణిలో పొందుపరిచిన ప్రశ్నావళి ప్రకారం అభిప్రాయాలను సేకరించారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంపై ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ P. నాగశ్రీ , సూపర్వైజర్లు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.