Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sankranti Festival : మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు

**ప్రథమ బహుమతి 50 గ్రాముల వెండి పట్టీలు

**రెండవ బహుమతి మిక్సీ

మూడో బహుమతి 1016 రూపాయలు.

**దోరేపల్లి గ్రామంలో .. బిజేపి బూత్ అధ్యక్షుడు మాదగోని నరేందర్ గౌడ్ ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు

Sankranti Festival : ప్రజా దీవెన/ కనగల్: మండలంలోని దోరేపల్లి గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి నకిరెకంటి మానస(50 గ్రా’ ల వెండి పట్టీలు), రెండవ బహుమతి నర్సింగ్ దివ్య ప్రిస్టేజ్ మిక్సీ), మూడవ బహుమతి సముద్రాల వసుమతి(పట్టుచీర) , నాల్గవ బహుమతి చిన్నపాక మాధురి (రూపాయలు₹1016)లు. బిజేపి రాష్ట్ర మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత,నల్గొండ జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ, పట్టణ అధ్యక్షురాలు తార, మండల మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి పాలకూరి సరిత చేతుల మీదగా బహుమతులు అందజేశారు.

 

మహిళలు వారి నైపుణ్యాలను వెలికి తీయడంలో సంక్రాంతి ముగ్గులు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి చెప్పారు. మాదగోని నరేందర్ ఆధ్వర్యంలో ఇంత మంచి పోగ్రాం చేసినందుకు కృతజ్ఞతలు తేలుపుతూ వారికి సాల్వతో సత్కరించారు ..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులకరం భిక్షం, ప్రధాన కార్యదర్శి దాసరి వెంకన్న,ఉపాధ్యక్షులు మాదగోని ఏడుకొండలు, సైదులు, లింగయ్య,సిద్దు, నరసింహ, శ్రవణ్, భుజ్జయ్య, సుధాకర్,రవి, కిరణ్, అంజయ్య, స్వామి, రాజేష్, ఈశ్వర్ భిక్షం, దేవేందర్, పాలకూరి సైదులు, హరిబాబు ,దోరేపల్లి గ్రామ మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు