Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sarat Chandra Pawar : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

Sarat Chandra Pawar : ప్రజాదీవెన, నల్గొండ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈ సంవత్సరంలో జిల్లాలో యాక్సిడెంట్ ఫ్రీ యే లక్ష్యంగా నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మిషన్ త్రిబుల్ ఆర్ నూతన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లాలో ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా,రోడ్డు నియమాలు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అన్నారు.ప్రమాదాలు ఎక్కువగా అతివేగంగా వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని, వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని జిల్లా అన్నారు. వాహనదారులు వాహన వేగం నిర్ణీత వేగం తగ్గించి నడపడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు.

 

అలాగే డ్రంకెన్‌డ్రైవ్‌, అతివేగం, మొబైల్‌ ఉపయోగిస్తూ డ్రైవింగ్‌, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించుట హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లాంటి సమయంలో రోడ్డు ప్రమాదం సంబవిస్తే అధిక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు కావలసిన తగు చూచనల పైన గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రమాదాల నివారణకు విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు ప్రమాదాలకు గల కారణాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ప్రమాదాల జరిగినప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.

అనంతరం ప్రమాదానికి గురి అయినప్పుడు వ్యక్తి ప్రాణాలు కాపాడుటకు డాక్టర్లచే సిపిఆర్ పై అవగాహన కలిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు, డి.టి.ఆర్బి ఇంచార్జ్ రిటైర్డ్ సీఐ అంజయ్య, స్థానిక పెద్దలు, 500 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.