–సకాలంలో స్పందించి మహిళా ప్రాణాలు కాపాడిన అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
Sarat Chandra Pawar:ప్రజా దీవెన, దేవరకొండ: కొండమల్లేపల్లి పోలీసు స్టేషన్ (Police Station) పరిధిలోని అంగోతు తండాకి చెందిన నందు- శ్రీనివాసులు, భార్య భర్తల మధ్య జరిగిన చిన్న గొడవకు మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహ త్యకు యత్నించిది. వెంటనే గమ నించిన భర్త తన మోటర్ సైకిల్ (Motorcycle)పైన ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో కొత్తబావి గేటు వద్ద కొండ మల్లెపల్లి యస్.ఐ రాముర్తి సిబ్బంది మజీద్, రాము, ప్రవీణ్, మల్లిఖార్జున్ లు వాహనాలను తనిఖీ చేస్తున్న వారికి జరిగిన విషయం చెప్పగా వెంటనే సమయస్ఫూర్తి తో స్పందించి బాధితురాలిని పోలీస్ వాహనంలో (Police vehicle) దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు ప్రస్తుతం మహిళా పరిస్థితి నిలక డగా ఉన్నదని వైద్యులు వెల్లడిం చారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ (Mr. SP) గారు మాట్లాడుతూ చిన్న చిన్న గొడవలకు క్షణికావేశంలో హత్మ హత్యలు చేసుకుంటే వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలు వారి కుటుంబ సభ్యులు పరిస్థితులు ఆగం అవుతాయని, జీవితంలో కష్ట సుఖలు సాధారణం అని వాటిని అదికమించి నిలబడి జీవించాలని అన్నారు.కావున ఇలాంటి నిర్ణ యాలు ఎవ్వరు కూడా తీసు కోకూడని అన్నారు. ఈ సందర్బంగా సకాలంలో సమయస్ఫూర్తితో స్పందించి మహిళా ప్రాణాలు కాపాడిన కొండ మల్లెపల్లి, సిఐ దనంజయ్య, యస్.ఐ రాముర్తి,సిబ్బంది మజీద్, రాము, ప్రవీణ్, మల్లిఖార్జున్ లు జిల్లా ఎస్పి గారు తన కార్యాలయంలో అభినందించారు.