Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SBI: ఎస్బిఐ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ బిడ్డ

SBI: దీవెన, న్యూఢిల్లీ: ఎస్బిఐ (SBI) సారథ్య బాధ్యతలను తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి (Challa Srinivasulu Shetty)స్వీకరించారు. ఎస్బిఐ చైర్మన్ దినేశ్ ఖారా (SBI Chairman Dinesh Khara) పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో శ్రీనివాసులు శెట్టి వచ్చారు. ఎస్బిఐ ని అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా నిలుపుతామని, మరిన్ని లాభాలను సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తన సందేశంలో శెట్టి పేర్కొన్నారు. ఎస్బిఐ బ్యాంక్ (sbi bank) రూ. 50 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తుండటం గర్వకారణమన్నారు.