Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SC Reservations : 4 వ రోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు

SC Reservations : ప్రజా దీవేన, కోదాడ: SC రిజర్వేషన్ల వర్గీకరణ చట్ట రూపం దాల్చే వరకు తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగ ఫలితాలను నియమాకాలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కోదాడ నియోజకవర్గ కేంద్రంలో MRPS, MSP ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4 వ రోజు కు చేరుకున్నాయి ఈ సందర్భంగా శనివారం దీక్షా శిబిరానికి కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు , ఎమ్మెస్ విద్యాసంస్థల చైర్మన్ ,ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈఓ ఎస్ఎస్ రావు లు పాల్గొని మద్దతు, మరియు సంఘీభావం ప్రకటించారు అనంతరం వారు మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ, ప్రస్తుత అసెంబ్లీలో చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మరియు మిగతా గ్రూపులకు సంబంధించిన ఫలితాలను అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాతనే రాబోవు నియామక ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిస్తారని తెలియజేస్తూ ఎమ్మార్పీఎస్ చేసే పోరాటాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో
నంగార బేరి జిల్లా అధ్యక్షులు (LHPS)బానోతు బాబు నాయక్, రామాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు భారీ వెంకన్న ,
ఎం ఎస్ పి, జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ ఎంఎస్పి, రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు మాదిగ , ఎంఎస్పి మండల నాయకులు ఆకారపు సుదర్శన్ కొండలు మాదిగ, బాణాల వెంకన్న మాదిగ, మాదిగ మహిళా సమైక్య జిల్లా నాయకురాలు, బచ్చలకూరి పుల్లమ్మ మాదిగ, వాకా సరస్వతి, షేక్ ఫాతిమా, తదితరులు దీక్షలో పాల్గొన్నారు