ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలి టీ పరిధిలోని ఐదవ వార్డు నరసయ్య గూడెం లో సుమారు 45 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ వస్తున్న ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారిని కబ్జా కు గురైన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. చర్యలు తీసుకోకపోవడంతో అలసత్వం మూలంగా ఏకంగా పాఠశాల మూతపడింది. ఈ పాఠశాల మూతపడి సంవత్సరాలు గడుస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవ డంతో పాఠశాల భవనం శిథిలా వస్థకు చేరింది. తలుపులు, కిటికీ లు ధ్వంసం చేశారు. గతంలో పిల్ల లతో కళకళలాడిన ప్రభుత్వ పాఠ శాల పేద పిల్లలకు దూరమైంది. ఈ పాఠశాలలోనే అంగన్వాడి కేంద్రం నిర్వహించారు. పాఠశాలకు దారి లేకపోవడంతో అంగన్వాడి కేంద్రా న్ని గ్రామంలో ఒక ప్రైవేట్ ఇంట్లో నిర్వహిస్తున్నారు. పాఠశాల భవన నిర్మాణానికి పెద్ద మనసుతో ఓ రై తు స్థలాన్ని దానమిచ్చారు. పాఠ శాల భవనం నిర్మాణం నుంచి ఉన్న దారిని ఈ మధ్యకాలంలో కబ్జా చేయటంతో పాఠశాల మూత బ డింది.
ఈ పాఠశాలలో గతంలో పోలింగ్ కేంద్రాన్ని నిర్వహించారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాన్ని నేరే డుచర్లలోని ప్రగతి విద్యాలయానికి మార్చారు. ప్రభుత్వము ఎంతో ఖ ర్చు పెట్టి నిర్మించిన పాఠశాల భవ నం దారిలేని కారణంగా మూతప డటంతో భవనం శిథిలావస్థకు చేరింది. పేద పిల్లలకు అందుబా టులో ఉన్న పాఠశాల మూతప డడంతో, విద్యార్థులకు, అంగన్వా డి పిల్లలకు ఇబ్బందిగా ఉంది. పాఠశాల మూత పడటంతో పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్య, పోషకాహారం, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వము ఈ పాఠశాలకు పూర్వ వైభవము తీసుకురావాలని గ్రామస్తులు కోరారు. చాలీచాలని ఆదాయంతో బతుకుతున్న పేదలు తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థలలో చదివించాలంటే భారంగా ఉంది.దిక్కులేని పరిస్థితిలో చిన్నపిల్లలను నేరేడుచర్లలోని ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమములో ఈ బడిబాట గురించి అధికారులు పట్టించుకోలేదు. ఎంతో కాలంగా పాఠశాలకు ఉన్న దారిని కబ్జా చేస్తే విద్యాధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. బాటలేని కారణంగా బడి మూతపడితే, అందులో చదివే విద్యార్థుల భవిష్యత్తు గురించి విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.పేద పిల్లలకు అందుబాటులో దాత45 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్థలంలో పాఠశాలను నిర్మించారు. పాఠశాల దారి కబ్జా అయిన విషయము అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదని గ్రామస్తులు తెలిపారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది. దాని చుట్టూ ఉన్న స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తలుపులు, కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా, పశువులకు పాకగా మారింది. సంబంధిత అధికారులు ఈ పాఠశాల వైపు కన్నెత్తి చూడటం లేదు. విద్యార్థులతో సందడిగా ఉన్న పాఠశాల దారిని కబ్జా చేసి మూతపడటానికి కారుకులెవరు? దారిని కబ్జా చేసిన వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వము కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుంటే,అధికారులు మాత్రం ఈ పాఠశాల పై నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు కబ్జాకు గురైన దారిని విడిపించి పాఠశాలను తిరిగి ప్రారంభించాలని గ్రామస్తులు కోరారు.
ఎంఈఓ వివరణ
దారిలేక మూతబడిన నర్సయ్య గూడెం పాఠశాల గురించి మండల ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి ని వివరణ అడగగా పాఠశాలకు సంబందించిన విషయం, దారి సమస్య నాకు తెలియదు,ఇంత వరకు నా దృష్టికి రాలేదు.ఎమ్మార్వో, డీఈఓ లను సంప్రదించి సంబందించిన విషయాలు తెలుసుకొని ఉన్నతాధికారుల ఆదేశానుసరం ఎంక్వరీ చేసి చర్యలు తీసుకుంటానని అన్నారు.