Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Senior Journalist Raghu : రఘు కుటుంబానికి అండగా ఉంటాం

రఘుకుటుంబాన్నిపరామర్శించిన: ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు

Senior Journalist Raghu : ప్రజా దీవెన, కోదాడ: ఎలక్ట్రాన్ మీడియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు చాలా రఘు మృతి జర్నలిస్టుల లోకానికి తీరనిలోటని రఘు కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని మాదిగ జర్నలిస్టుల ఫోరం జాతీయ అధ్యక్షులు మాతంగి దాసు అన్నారు , కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పడిశాల రఘు ఇటీవల మృతి చెందడంతో. ఈ సందర్భంగా శుక్రవారం రఘు నివాసానికి వెళ్లి రఘు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల తరఫున ముందుండి ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాడన గుర్తు చేశారు అలాగే మాదిగ జర్నలిస్టులకు రాష్ట్ర నాయకుడిగా ఎన్నో సేవలందించి జర్నలిస్టులను ఆదుకున్నారని తెలిపారు.

 

ఈ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. పడిశాల రఘు మృతి పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారని తెలిపారు. రఘు కుటుంబాన్ని పరామర్శించేందుకు మంద క్రిష్ణ మాదిగ కూడా సిద్ధంగా ఉన్నారని త్వరలోనే రఘు కుటుంబాన్ని పరామర్శిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ జర్నలిస్టులు మరియు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు నాయకులందరూ రఘు కుటుంబానికి అండగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు కోట రాంబాబు, బంక వెంకటరత్నం, పిడమర్తి గాంధీ, జిల్లా నాయకులు బొంగారాల మట్టయ్య, తోటపల్లి నాగరాజు, బయ్యారపు రవీందర్ , నియోజకవర్గ నాయకులు చెరుకుపల్లి శ్రీకాంత్,సత్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.