Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Senior Manager KNK Prasad : ఎఫ్ సిఐ ఆధ్వర్యంలో స్వచ్చత ర్యాలీ

Senior Manager KNK Prasad : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పరిసరాల స్వచ్చత పై  అవగాహన కల్పించే ప్రయత్నంలో ప్రతి పౌ రుడూ భాగస్వామి కావాలని భారత ఆహార  సంస్థ నల్గొండ జిల్లా  సీనియర్ మేనేజర్ కే ఎన్ కే ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా నిర్వహి స్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పని ప్రదేశాలు ఇతర బహి రంగ ప్రదేశాలలో మాత్రమే కాక, ఇతర పరిసరాల శుభ్రత, స్వచ్చత గణనీయంగా మెరుగుపడిందని ఆయన అన్నారు.

సంస్థ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న స్వచ్చత పక్షోత్స వాల్లో భాగంగా సంస్థ నల్గొండ గో దాము నుండి జిల్లా కలక్టరేట్ వర కు గురువారం సామూహిక ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పా ల్గొన్న ఉద్యోగులు స్వచ్ఛ భారత్ ని నాదాలతో కలక్టరేట్ వరకు ర్యాలీ గా వెళ్లి స్థానికుల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు బిల్లా శ్రీనివాస రావు, సతీశ, పవన్, కుసుమ, కాసిరెడ్డి, సుకుమార్, ఆదిమల్ల శంకర్, రాము మరియు నిర్వాహకులు సతీష్ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.