ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
SFI : ప్రజాదీవెన ,నల్లగొండ టౌన్ : దొడ్డి కొమురయ్య భవనంలో ఫిబ్రవరి 19 ,20 తేదీలలో నల్లగొండ పట్టణ కేంద్రంలో నిర్వహించే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపునరేష్ కంభంపాటి శంకర్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించి గత సంవత్సర కాలం పాటు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విద్యార్థి ఉద్యమాలను నెమరు వేసుకుంటూ సాధించిన విజయాలు జరిగిన లోటుపాట్లను అధిగమించడం కోసం, భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించుకోవడం కోసం ఈ మహాసభలు వేదిక కానున్నాయని అన్నారు. నల్గొండలో జరిగే జిల్లా మహాసభలకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రతినిధులు సుమారు 200 మంది ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారు.\
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఇటీవల కాలంలో అనేక ఉద్యమాలు నిర్వహించిది ముఖ్యంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని నల్లగోండ జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర లు నిర్వహించడం జరిగింది.వసతి గృహ విద్యార్థులకు సొంత భవనాలు కట్టించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై జరుగుతున్న ఫుట్పాయిజనలపై మరియు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ కై జిల్లా కలెక్టరేట్లో విద్యార్థి మహాగర్జనలు, క్లాక్ టవర్ సెంటర్లో దీక్షలతో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించి విద్యారంగంలోకి మతోన్మాద కషాయికరణ భావజాలను తెప్పించడం కోసం విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడంఎంత వరకు కరెక్ట్ నరేంద్రమోడీ కంకణం కట్టుకున్నారు.
విశ్వవిద్యాలయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు యూజీసీ ని తీసుకురావడం జరిగిందని అన్నారు. దేశంలో బిజెపి అనుసరిస్తున్న విద్యావ్యత్రేయక విధానాలపై భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కావాలి కాంగ్రెస్ కావాలని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటాయి చేతలు గడప దాటడం లేదన్నట్టు రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ విడుదల చేయకుండా విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదైననైనా పేద మధ్యతరగతి విద్యార్థుల స్కాలర్షిప్లు వస్తాయని ఆశపడిన విద్యార్థులకు నిరాశే మిగిలిందని అన్నారు. భవిష్యత్తులో నల్లగొండ జిల్లా విద్యారంగం అభివృద్ధి కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సమరశీల రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కొంచెం కావ్య,నకిరేకల్ డివిజన్ కార్యదర్శి ముసుగు రవీందర్, నల్గొండ డివిజన్ ఉపాధ్యక్షులు కిరణ్, సాయి ,స్పందన ,సిరి,పావని,
మున్నా ప్రశాంత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.