–నల్లగొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్
Shankar Naik : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలం గాణ రాష్ట్రానికి నిధులు కేటాయిం చకుండా బిజెపి ప్రభు త్వం వివక్ష చూపించిందని డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ విమర్శిం చారు.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా టిపిసిసి పిలుపు మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమ వారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మం త్రి నిర్మల సీతారామన్ దిష్టిబొ మ్మను దగ్ధం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణపై వివక్షత చూపించిందని ధ్వజ మెత్తారు.ఎన్నికలు జరిగే రా ష్ట్రాలకు మాత్రమే ఎక్కువ బడ్జెట్ కేటాయించిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రా లకు బడ్జెట్ కేటాయించకుండా పక్షపాతం వహించిందని పేర్కొ న్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్య తిరేక విధానాలపై ఉద్యమిం చాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కుల,మెతాల పేరుతో విడదీస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి బిజెపి ప్రభుత్వాన్ని గద్దెధించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సమైక్యతకు మారుపేరని అన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు, పేదలకు న్యాయం జరు గుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ బడు గు,బలహీన వర్గాల పార్టీ అని అ న్నారు. రాబోయే రోజులలో కేంద్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రా హుల్ గాంధీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు.పట్టణ కాంగ్రెస్ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి 26 వేల కోట్ల పన్నులు తీసుకొని బడ్జెట్లో తెలం గాణకి కేటాయించింది గుండు సు న్నా అని అన్నారు. మోడీ మూ డుసార్లు పీఎం అయినా పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు.
సీఎం రేవం త్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి రూ.1 లక్ష 60 కోట్లు కేటాయించాలని కోరడం జరిగిందని తెలిపారు. అయినప్ప టికీ కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించ కుండా కక్షపూరితంగా వ్యవహరి స్తుందని ఆరోపించారు. చిన్న రా ష్ట్రాలు అభివృద్ధి కోసం మోడీ నిధులు కేటాయించకుండా పక్ష పాతం చూపించాడని విమర్శిం చారు. మోడీ పేదల కోసం బడ్జెట్ కేటాయించకుండా కార్పొరేట్ సంస్థలకు బడ్జెట్ కేటాయిస్తున్నా డని ఆరోపించారు.ఈ కార్యక్రమం లో నల్గొండ మార్కెట్ కమిటీ చై ర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పి టిసి వంగూరి లక్ష్మయ్య, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, ప్రాం తీయ రవాణా శాఖ డైరెక్టర్ కు సుకుంట్ల రాజిరెడ్డి, మాజీ కౌన్సి లర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిగ శ్రీను, బొజ్జ శంకర్, సమద్, కత్తుల కోటి, ఖలీల్, ఇంతియాజ్ హుస్సేన్, పోలే జయాకర్,అల్లి సుభాష్ యాదవ్, ఎండి ఇంతి యాజ్, దుబ్బ అశోక్ సుందర్, బీరం కరుణాకర్ రెడ్డి,ఇటికాల శ్రీనివాస్, ఇబ్రహీం, గురిజ వెంక న్న,వజ్జ రమేష్ యాదవ్, జూల కంటి వెంకట్ , పుట్టా రాకేష్, వెం కన్న గౌడ్,యువజన కాంగ్రెస్ పట్ట ణ అధ్యక్షుడు గాలి నాగరాజు, ని యోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, అజ్జు, ఎలుక సైదిరెడ్డి, పిల్లి గిరి యాదవ్, పేర్ల ఈశ్వర్, జెకె రాజు, కంచర్ల కుంట్ల వెంకట్ రెడ్డి, పాదం అనిల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, చింతపల్లి గోపాల్, నాగేశ్వరరావు, కిన్నెర అంజి, పెరిక హరిప్రసాద్, దాసరి శంకర్, దాసరి విజయ్, పరుశురాం, కృష్ణ, వెంకన్న, యాద గిరి తదితరులు పాల్గొన్నారు.