Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shankar Reddy : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయం

–మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శంకర్ రెడ్డి

Shankar Reddy : ప్రజా దీవెన, శాలిగౌరారo:
పేదల,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయం తో పని చేస్తుందని శాలిగౌరారం వ్యవసాయం మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి అన్నారు. శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామాన్ని ఫైలెట్ గ్రామంగా అధికారులు గుర్తించి నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు 161,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 04,రేషన్ కార్డులు 154,రైతు భరోసా 460 మంది లబ్దిదారులను ఎంపిక చేసి మంజూరి పత్రాలను అందజేశారు.

 

ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈ ఈ, మండల స్పెషల్ ఆఫీసర్ మాన్యానాయక్, తహసీల్దార్ పి. యాదగిరి, ఎంపీడీఓ సుధాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, బండపెల్లి కొమరయ్య గౌడ్, మాదగోని అంజయ్య, ఎంపీవో పద్మ, ఏఓ సౌమ్య శృతి,ఏపిఓ జంగమ్మ, డిటి వరప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండపెల్లి అంజమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి భరత్, ఏఈఓ ప్రదీప్, ఈసీ వెంకటాచారీ గ్రామస్థులు పాల్గొన్నారు.