Shocking News : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చిం ది. తెలంగాణ ప్రభుత్వ సలహాదా రు కె. కేశవరావు(కేకే) మనవడు వ శిష్ట్ ధ్రువ్ (21) తాగిన మత్తులో కా రు నడుపుతూ ఆటోను ఢీకొట్టిన సంఘటన జరిగింది.
ఆదివారం రోజు తన స్నేహితుడితో కలిసి కా రులో కేబీఆర్ పార్క్ మీ దుగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు బయలు దేరాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద సిగ్నల్ పడటంతో ముం దు వెళ్తున్న ట్రాలీ ఆటో ఆగింది.
దీంతో వెనక వస్తున్న ధ్రువ్ ఒక్క సారిగా ట్రాలీని ఢీకొట్టాడు. ఈ ఘ టనలో కారు ముందు భాగం, ఆటో వెనుక భాగం ధ్వంసమయ్యాయి. పోలీసులు ధ్రువ్కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 150 బీఏసీ పా యింట్లు వచ్చాయి. దీంతో ఆయన కారును పోలీసులు సీజ్ చేశారు. కారు నడుపుతున్న వశిష్ట్ ధ్రువ్పై సుమోటో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్లో నివసిస్తున్న కేకే కుమారుడు విప్లవ్ కుమార్ కుమా రుడే వశిష్ట్ ధ్రువ్. బీఆర్ఎస్ హ యాంలో తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థ కార్పొరే షన్ చైర్మన్గా విప్లవ్ కుమార్ పని చేశారు.