Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shri Mantula Pragati: ఆశా కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగ ఖండించిన

ప్రజా దీవెన, బోడుప్పల్: న్యాయమైన సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలపై దాడి చేసి, అక్రమంగా అరెస్టులు చేసిన ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ మేడ్చల్ జిల్లా కార్యదర్శి శ్రీ మంతుల ప్రగతి.. ప్రగతి మాట్లాడుతూ..రేవంత్‌ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయని ప్రగతి అన్నారు. లగచర్లలో గిరిజన మహిళలపై పోలీసులు అఘాయిత్యాలకు ఒడిగట్టారని, ఇప్పుడు ఆశా వర్కర్లపై దమనకాండ కొనసాగించారని అన్నారు. వాడలేని భాషలో తిడుతూ ఇష్టం వచ్చినట్టు ఆశా కార్యకర్తలను వివరించారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించే రోజే ఆశా వర్కర్లపై పోలీసుల దాడి చేయడం అమానుషం, మహిళలు అని కూడా చూడకుండా ఆశా కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రగతి డిమాండ్ చేశారు. నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్‌ రెడ్డికి మహిళలు బుద్ధి చెప్తారని.. ఆశావర్కర్ల విషయంలో రేవంత్‌ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తించిందని ప్రగతి ఆవేదన వ్యక్తం చేశారు..