Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shridhar Babu:రుణమాఫీపై మాట్లాడే అర్హత లేదు

–శాంతి భద్రతలు, స్థానిక సంస్థలపై నా మాట్లాడే హక్కు బీఆరెస్ కు లేదు
–రైతు సమస్యలపై బీజేపీది మొస లి కన్నీరు
–మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

Shridhar Babu:ప్రజా దీవెన, హైదరాబాద్: శాంతి భద్రతలు, రుణ మాఫీ, స్థానిక సంస్థ లు (Law and order, loan waiver, local bodies s) పై మాట్లాడే హక్కు బి. ఆర్ ఎస్కు లేదని మంత్రి శ్రీధర్ (Shridhar Babu) మండి పడ్డారు. రైతు సమస్య లంటూ బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోంద ని ఎద్దేవా చేశారు. మంగళ వారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తరువాత సీల్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిమ్మిని బమ్మిని చేయాలని బి ఆరెస్ నాయకులు చూస్తున్నారన్నా రు. 31 తేదీ లోగా బడ్జెట్ కు సంబం ధించి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని, లేకుంటే జీతాలు ఇవ్వ లేని పరిస్థితి వస్తుందన్నారు. 3 రోజుల్లో బడ్జెట్ పై చర్చ ను పూర్తి చేయాలన్నారు. మాజీమంత్రి హరీ ష్ రావుకు అన్నీ ప్రొసీడింగ్స్ తెలుస న్నారు. బీఆరెస్ ప్రభుత్వ హయాం లో సమయం ఉన్నా 8 రోజులు కన్నా ఎక్కువ సభను జరపలేద న్నారు.

అభివృద్ధి సంక్షేమ కార్యక్ర మాలపై (Development Welfare Program) చర్చకు అవకాశం ఇవ్వాల ని ప్రభుత్వం స్పీకర్ ని కోరిందని శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీ సమావే శాలు ఎక్కువ రోజులు జరపాలని ప్రభుత్వం ఆలోచన ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క హామీని విస్మరించదని తెలి పారు. ఆర్థిక వ్యవ స్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతు న్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ దేనని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజా సమ స్యలపై చర్చకు ప్రభుత్వం వెనక్కి పోదన్నారు. ప్రతిప క్షాలు ఇచ్చిన అంశాలపై స్పీకర్ పరిశీలించి నిర్ణ యం తీసుకుంటారన్నారు. డిమాం డ్లపై చర్చ సమయంలో అన్ని అంశా లపై కూలంకుషంగా మాట్లాడవచ్చు నన్నారు. తెలంగాణ అవసరాల దృష్ట్యా ఎక్కువ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరా మని మంత్రి తెలిపా రు. తెలంగాణకు చట్ట ప్రకారం కేం ద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించటంలో గత బీఆరెస్ ప్రభు త్వం విఫలమైందన్నారు. నిధులు విషయంలో కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. విభ జన చట్టానికి సంబంధించి ఏపీ కి ఇచ్చిన ప్రాధా న్యత తెలంగాణకు కూడా ఇవ్వాల ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామ న్నారు. తెలంగాణపై కేంద్రం (central)చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు.

రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రంపై బీజేపీ నేతలు (BJP leaders at the centre) ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రతిపక్షం అడిగిన ప్రతి అంశంపై సభలో చర్చి స్తామని తెలి పారు. ప్రధాని ని కలిస్తే బీజేపీకి దగ్గర అయినట్టు కాదన్నా రు. బీజేపీ, బీఆ రెస్ కలిసినట్టు కాంగ్రెస్ కలవదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజ నాలు, హక్కులను కాపాడుకోవ డంలో కేంద్రంపై పోరాటం చేస్తామని, సిఎం కూడా స్పందిస్తార న్నారు. ప్రతిపక్ష ఆరోపణలు సత్య దూరమన్నారు. రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ప్రగతిశీల తెలంగాణకు నష్టం చేయవ ద్దని కేంద్రాన్ని కోరుతున్నా మని తెలిపారు.