Shyamsunder : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం అడ్లూర్ గ్రామంలో వి హెచ్ పి మాతృశక్తి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు నకిరేకల్ ఎస్ ఎల్ ఎన్ ఎస్ షాపింగ్ మాల్ ఎండి గట్టు శ్యాంసుందర్, లయన్స్ క్లబ్ పాస్ట్ జోన్ ఛైర్మెన్,అశోకా టెక్సటైల్స్ ఎండి రావిరాల అశోక్ లు చీరలు, కన్సలేషన్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం లో మాతృ శక్తి జిల్లా ప్రతినిధులు సత్యవతి, కల్పన, సులోచన, గ్రామస్థులు భూపతి శ్రీనివాస్-భవాని దంపతులు గ్రామ మాతృశక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.