Singer Madhupriya :ప్రజా దీవెన, జయశంకర్ భూపాల పల్లి: శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవాల యంలో సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదంలో మీడియా ప్రసారం చేసిన కథనాలపై తెలం గాణ దేవాదాయశాఖ స్పందిం చింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈవో మారుతిపై బదిలీ వేటు పడింది.
ఆలయ ఈవోను కరీంనగర్ జిల్లా మానుకొండూర్ గుట్టుదుద్దనపల్లి శ్రీఆంజనేయస్వా మి ఆలయానికి దేవాదాయశాఖ అధికారులు బదిలీ చేశారు. మారు తి స్థానంలో కాళేశ్వర ముక్తేశ్వ రస్వామి ఆలయానికి గతంలో ఈ వోగా పనిచేసి కొడవటంచ లక్ష్మీన రసింహ దేవస్థానానికి బదిలీ అయి న గ్రేడ్-1 అధికారి మహేశ్కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. అలాగే షూటింగ్ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడు రామకృష్ణకు అధి కారులు నోటీసులు జారీ చేశారు.
కాగా, ఈనెల 20న అనుమతి లే కుండా ముక్తేశ్వర ఆలయ గర్భ గుడిలో సింగర్ మధుప్రియ ప్రైవే టు ఆల్బమ్ షూటింగ్ చేశారు. దీని పై తీవ్ర వివాదం చెలరేగింది. సాధా రణంగా కాళేశ్వర ఆలయంలో ఫొ టోలు, వీడియోలు తీయడానికి అనుమతి ఉండదు. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా మధుప్రి య పాటలు చిత్రీకరించారు. భక్తు ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వివాదంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఘటనపై మీడియా వరస కథనాలు ప్రచురిం చింది. దీంతో దేవాదాయశాఖ అ ధికారులు స్పందించి చర్యలు చేప ట్టారు.