Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SLBCtunnel : తప్పిన ఘోరం, ఎస్ఎల్ బిసి సొరంగంలో ప్రమాదం

SLBCtunnel : ప్రజా దీవెన, నాగర్ కర్నూలు: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరం గంలో పెను ఘోరం ప్రమాదం తప్పింది. దోమ ల పెంట ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ ఎల్ బీసీ ఇన్లెట్ టన్నెల్ లో వద్ద మూడు మీటర్ల మేర పై కప్పు పడిపోవడం తో ఈ ప్రమాదం సంభవించింది. ఎడమ వైపు సొరంగం 14వ కిలో మీటర్ వద్ద ఉదయం 8.30 గంటల సమ యంలో ప్రమాదం జరి గింది.

ఇదిలా ఉండగా ఎడమ సొరంగం వద్ద 4 రోజులు క్రితం పనులు మ ళ్లీ ప్రారంభమయ్యాయి. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల్ వద్ద పై కప్పు ఊడి పడటంతో కార్మికులుస్వల్ప గాయాలతో బయటపడ్డా రు. క్షత గాత్రులను నిర్వాహకులు ఆసు పత్రికి తరలించారు. ఈ క్రమం లో నీటిపారుదల శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థి తులను పర్యవేక్షిస్తున్నారు.ఘటన పై ఇరిగేషన్ అధికారాలు ఆరాతీ స్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో ఊపి రి పీల్చుకున్నారు.

సొరంగంలో చిక్కుకున్న ఏడుగురు కార్మికులు… నల్గొండలోని శ్రీశై లం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌‌లో శని వారం ప్రమాదంలో 35 మంది కార్మి కులు టన్నెల్‌లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా టన్నెల్ కుంగిపో యింది. అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. ఘటనపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయా లని అధికారుల ను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులు సంఘటన స్థలికి చేరుకున్నారు.

 సీఎం రేవంత్ దిగ్బ్రాంతి... ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద జరిగిన ప్రమా దం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నె ల్‌ వద్ద పై కప్పుకూలి పలువురికి గాయాలైన సమాచారం అం దిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికా రులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికా రులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయ లుదేరారు.