–ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్
Slbctunnel : ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: ఎస్ఎల్ బిసి టన్నెల్ లోకి వెంటిలేషన్ పనులు కొనసాగుర్తున్నాయని,మట్టి తవ్వకాలు మరింత వేగవం తంగా, డివాటరింగ్ ప్రక్రియ కొన సాగుతున్నాయని ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. శనివారం ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సొరంగం లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతా ధికారులతో కలిసి స హాయక చర్యలను పర్యవేక్షించారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చం పేట నియోజకవర్గం అమ్రాబాద్ మం డలం దోమలపెంట గ్రామంలో గల SLBC సొరంగo లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆ చూకీ తెలుసుకునేందుకు చేప డుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు, సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ, నిరం తరాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లకు చెందిన సహాయక బృం దాలు పూర్తిస్థాయిలో నిర్విఘ్నంగా సహాయక చర్యలు చేపడుతు న్నట్లు వివరించారు.
టన్నెల్ లోపల స్టీల్ తొలగింపు ప నులు, మట్టి తవ్వకాలు, ఊట నీ టిని బయటకు తరలించే ప్రక్రియ, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి నీ ట న్నెల్ బయటకు చేరవేసే ప్రక్రియ, సమాంతరంగా జరుగుతున్నట్లు సహాయక బృందాలు పూర్తిస్థాయి లో సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
GSI అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం టన్నె ల్ ప్రమాద ప్రదేశం వద్ద పరిస్థితుల ను గమనిస్తూ,సహాయక బృందాల ఉన్నతాధికారులకు తగిన సూచన లు, సలహాలు ఇస్తున్నట్లు తెలిపా రు.శనివారం ఉదయం మట్టి తవ్వ కాలకు అనుగుణంగా వెంటిలేషన్ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తు న్నట్లు వివరించారు .
ఈ సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, జే పీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజ నీర్ సంజయ్ కుమార్ సింగ్, సిం గరేణి వైన్స్ రిస్క్యూ జనరల్ మే నేజర్ బైద్య, ఎస్ డి ఆర్ ఎఫ్ అధి కారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీం ద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.