Somanna : ప్రజా దీవెన, శాలిగౌరారం: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి న్యాయ బద్ధమైన ఏబిసిడి ఉపకులాల న్యాయ వర్గీకరణ కు మద్దతుగా ఏప్రిల్ 7న హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై నిర్వహించే లక్ష డప్పులు వెయ్యి గొంతుల సభ పోస్టర్ ను నల్గొండ జిల్లా శాలిగౌరారం మండ లం పెర్కకొండారం గ్రామం లో దేవరకొండ మస్తాన్ ఆధ్వర్యంలో ఏపూరి సోమన్న ఆవిష్కరించా రు. న్యాయమైన వర్గీకరణకు మద్దతు గా పెర్క కొండారం నుంచి హైదరా బాద్ ట్యాంక్బండ్ వరకు పాదయా త్ర కు ఏపూరి సోమన్న పాల్గొని మద్దతు తెలిపి పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్బంగా ఏపూరి సోమన్న మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ తో మాదిగలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుం దని ఈ సభకు పెద్ద ఎత్తున మాది గలు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ జానయ్య,దేవరకొండ హల్లయ్య, సాలయ్య, దేవరకొండ కృష్ణ లక్ష్మణ్, మేళ్ల సాంబయ్య,మాచర్ల యాదగిరి పాల్గొన్నారు