– . ఇద్దరు నిందితులు పరారి.
– నిందితుల నుండి రూ. లక్ష విలువ గల 9 కేజి ల 860 గ్రాముల గంజాయి, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం.
SP K Narasimha : ప్రజా దీవేన,కోదాడ: సూర్యాపేటజిల్లా ఎస్పీ కె నర్సింహా IPS మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యలయం లో అధనపు ఎస్పీ నాగేశ్వరావు, కోదాడ డివిజన్ DSP శ్రీధర్ రెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము తో కలిసి మీడియా సమావేశం లో గంజాయి కేసు వివరాలు వెల్లడించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆంద్రా కృష్ణ జిల్లాకు చెందిన A1 నింధితుడు మల్లెడ వెంకట వంశీ మరియు A2 గోకులముడి ఆనంద్ అనే వ్యక్తులు ఆంద్ర, ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి చిన్న చిన్న పాకెట్ లు చేసి ఈ పాకెట్లను హైదరాబాద్ లో గంజాయి అలవాటు ఉన్న వారికి అమ్మితూ ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిశ్చయించుకుని NTR కృష్ణ జిల్లా పెనమూరు మండలానికి చెందిన A3 నింధితుడు చొరగుడి తేజ తో కలిసి విజయవాడ నుండి హైదరాబాద్ కు బస్ లో వెళ్తూ మార్గ మద్యలో అనగా కోదాడ శివారులోని ఉన్న దుర్గాపురం X రోడ్ వద్ద బస్ దిగి రోడ్ ప్రకన ఉన్న మామిడి తోట లోకి సంపత్, హేమన్ నర్సింహా సాయి, కృష్ణ చైతన్య, భాస్కర్ లతో కలిసి వెళ్ళి వారికి గంజాయి త్రాగడానికి ఇస్తుండగా నమదగిన సమాచారం పై సోమవారం మద్యాహ్నం 1 గంట సమయంలో కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు వారిని పట్టుకున్నారు. ఇట్టి కేసులో A1 మల్లెడ వెంకట వంశీ మరియు A2 గోకులముడి ఆనంద్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు అని ఎస్పీ గ తెలిపారు.
పరారీలో ఉన్న ఇద్దరు నింధితులను పట్టుకోవడానికి పోలీస్ తీమ్స్ ఏర్పాటు చేశామని ఎస్పీ అన్నారు. గంజాయి విలువ 1,00,000/- మరియు ఐదు సెల్ ఫోన్ల విలువ సుమారు 60,000/- మొత్తం విలువ 1,60,000/- రూపాయలు ఉంటుందని అంచనా వేయడం జరిగింది తెలిపారు. గంజాయి పట్టుకున్న కేసుల్లో నిందితులు అలవాటుగా ఇలాంటి నేరాలకు పాల్పడితే సామాజిక రక్షణలో భాగంగా PD యాక్ట్ నమోదు చేసి ఎక్కువరోజులు జైలులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం అని ఎస్పి తెలిపారు. గంజాయి సరఫరా చేసిన వినియోగించిన అది చట్టపరమైన నేరము, దీనికి సంభందించి పౌరులు, ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలి డయల్ 100 కు లేదా స్థానిక పోలీసులకు తెలియచేయాలిని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పి అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రజలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని గంజాయి నిర్మూలనలో ప్రజలు పౌరులు అందరూ భాగస్వామ్యం కావాలని పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
సదరు నేరస్థున్ని పట్టుబడి చేసిన దాంట్లో కోదాడ టౌన్ ఎస్ఐ ఎస్.కె సైదులు, Si లింగయ్య, హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, వి.రామ రావు, కానిస్టేబుల్స్ సతీష్ నాయుడు, యెల్లారెడ్డి , యస్.కె ఫరీద్, శివ కుమార్ మరియు నాగేంద్ర బాబు, పర్యవేక్షణ చేసిన సిఐ టి.రాముని పోలీస్ అధికారులు ఎస్పీ అబినందించినారు.