Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Pawar : సైబర్ నేస్తం కార్యక్రమం ద్వారా మోసపోయిన బాధితుల సమస్యలు పరిశీలన

SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఎక్కువగా భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు రాగ బాధితుల ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు.

అలాగే డయల్ యువర్ సైబర్ నేస్తంకి సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపోయిన నలుగురు బాధితులు నేరుగా పిర్యాదు మరియు ఆరుగురు బాధితులు ఫోన్ కాల్ ద్వారా వారి సమస్యలు తెలియజేయడం జరిగింది.ఎవరైనా బాధితులు సైబర్ మాసాలకు గురి అయితే వెంటనే 1930 గాని https://www.cybercrime.gov.in గాని సమాచారం అందించాలని కోరారు.ప్రతి సోమవారం 11గంటల నుండి 2 గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డయల్ యువర్ సైబర్ నేస్తం అనే కార్యక్రమం ఉంటుందని మీ సమస్యలు తెలుసుకొనుటకు ఫోన్ నంబరు 8712658079 కాల్ చేయగలరని తెలిపారు.