Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Pawar: జిల్లా కేంద్రంలో పోలీసుల బైక్ ర్యాలీ

SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్స వాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేం ద్రంలో శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీనీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) ప్రారంభించి పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్స వాలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద నుండి ప్రారంభమై క్లాక్ టవర్, గుండెగోని మైసయ్య గౌడ్ విగ్రహం,ప్రకాశం బజార్, డీఈఓ ఆఫీస్ (Maisaiyya Goud Statue, Prakasam Bazar, DEO Office)ల ద్వారా నుంచి క్లాక్ టవర్ వరకు పోలీసు సిబ్బంది పట్టణ యువకులతో బైక్ ర్యాలీ ఉత్సా హంగా సాగింది.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ప్లాగ్ డే నిర్వహిస్తున్నాము. అమరుల త్యాగాల గుర్తుగా అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నా మని, దీనిలో భాగంగా పట్టణ కేంద్రంలో ఎందరో అమరుల త్యా గాలను గుర్తు చేసుకుంటూ బైక్ ర్యాలీ (Bike rally) నిర్వహించడం జరిగిందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్ష ణలో విధి నిర్వహణ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులై న వారి ఆత్మ శాంతి కలగాలని అన్నారు. జిల్లా పోలీస్ ప్రజా సం క్షేమం కొరకు శాంతి భద్రతల పరిర క్షణలో నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.అలాగే ర్యాలీ సందర్భం గా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ కొరకు హెల్మెట్ తప్పక ధరించాలని, వాహనదారులు రోడ్డు భద్రత (Road safety) నియమాలు పాటించాలని అన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో (road accidents) అధికం గా తలకు గాయం కావడం వలన వాహనదారులు మరణించడం జరుగుతోందని,ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనం నడపాలని ఎస్పీ (Sp) కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామలు నాయక్, ఎస్బి డి.ఎస్పి రమేష్, నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు, సిఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, డానియల్, సైదులు, నాగరా జు, కొండల్ రెడ్డి, ఆర్ ఐ లు సంతో ష్, శ్రీను, సూరప్ప నాయుడు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.