–కబడ్డీ పోటీల ప్రారంభoలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: మిషన్ పరివర్తన్, యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహించ తలపెట్టిన కబడ్డీ పోటీలను గురు వారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్- యువతేజం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను హలియ మండల కేంద్రం లో జిల్లా ఎస్పీ ప్రారంభించి మాట్లా డుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన క్రీడల వల్ల గ్రామీణ యువతకు పోలీసులకు మధ్య స్నేహభావం పెరుగుతుందని అన్నారు.ముఖ్యంగా యువత చెడు మార్గంలో పక్కదారి పట్టకుం డా సక్రమ మార్గంలో ఉండేందుకు ఎంతో దోహదపడతాయని అన్నా రు.క్రీడలు మానసిక ఉల్లాసం, శారీ రక దారుఢ్యం కలుగుతుందని అ న్నారు.
ఆటలలో గెలుపోటములు సహజమని ఆటలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.మిషన్ యువ తేజం కార్యక్రమంలో భా గంగాజిల్లా వ్యాప్తంగా యువత ఉత్సాహవంతంగా అన్ని మండ లాల పరిధిలో కలిపి దాదాపు 370 టీమ్ లు నమోదు చేసుకోవడం జరిగిందని వీరందరికీ మండల, డివిజన్ పరిధిలో నిర్వహించి గెలు పొందిన జట్లను జిల్లా స్థాయిలో ని ర్వహించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు హలియ సిఐ జనార్ధన్ గౌడ్,యస్.ఐలు గోపాల్ రావు,ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు, యువత పాల్గొ న్నారు.