Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Power : నల్లగొండలో పోలీసుల తనిఖీలు, డాగ్ స్వాడ్ తో ఆనవాళ్ళ గుర్తింపు

SP Sarath Chandra Power :ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో పోలీసుల వి స్తృత తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు ఆధ్వర్యం లో నిషేధిత మత్తు పదార్ధాలు, ఇత ర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తిం చేందుకు గాను ప్రత్యేకంగా శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించా రు. బస్టాండు తో పాటు లాడ్జి, దు కాణాలను సిబ్బందితో కలిసి తని ఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై సైదులు మా ట్లాడుతూ ఎవరైనా అనుమానా స్పద వ్యక్తుల ఆనవాళ్లు ఏమైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇ వ్వాలని కోరారు. అదే సందర్భంలో లాడ్జీల్లో బస చేసే వారి సరైన ధ్రువీ కరణ పత్రాలు తీసుకోవాలని, వారి వివరాలు రికార్డుల్లో నమోదు చే యాలని సూచించారు. చట్ట విరు ద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వవద్ద న్నారు. అనుమానితుల వివరా లను వెంటనే తమకు తెలియజే యాలని సూచించారు.నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చ ర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు.

గంజాయి నిర్మూలనకు సహక రించాలి…. గంజాయి, మత్తు ప దార్థాలకు దూరంగా ఉండాలని వాటి నిర్మూలనకు ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఎవరైన నిషేధిత మత్తు పదార్థలు వాడితే చర్యలు తప్పవన్నారు. త ల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించా రు.
ప్రజల ప్రాణాలకు హాని చేసే గంజా యి లాంటి మత్తు పదార్థాలను ని ర్మూలించడంలో ప్రజలు, యువత కీలక పాత్ర పోషించాలని చెప్పారు. పట్టణంలో గంజాయి మూలాలను తొలగించడం కోసం పట్టణ పోలీసు లు పటిష్ఠంగా పనిచేస్తున్నామ న్నా రు. సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు పోలీసు లకు సహకరించాలన్నారు. స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.