Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Power:పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ

–తిప్పర్తి, మాడుగులపల్లి, వేము లపల్లి, మిర్యాలగూడ స్టేషన్ లను జిల్లా నూతన ఎస్పి శరత్ చంద్ర పవర్ తనిఖీ

SP Sarath Chandra Power: ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, మాడుగుల పల్లి, వేములపల్లి, మిర్యాలగూడ 1టౌన్, 2 టౌన్, రూరల్ పోలీసు స్టేషన్ లను తనిఖీ చేసి సిబ్బంది పని తీరు, వివరాలు, అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ల పరిసరాలు, పరిధి లోని స్థితిగతులు,పోలీస్ స్టేషన్ రికార్డుల వివరాలు,క్రైమ్ రేటు, శాంతి భద్రతలకు మరియు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఎస్పీ (SP Sarath Chandra Power) మాట్లాడుతూ పోలీ సు స్టేషన్ కు వచ్చే ప్రజలతో గౌర వంగా వ్యవహరించాలని సూచిం చారు. రానున్న రోజుల్లో మరింత సమిష్టిగా శ్రమించాలని, గ్రామస్థా యిలో పరిస్థి తులను లోతుగా అధ్యయనం చేయాలని, సమస్య లు ఉత్పన్నం కాకుండా అప్రమత్తం గా ఉండాలి అని తెలిపారు. గ్రామాలలో సమస్యలకు కారణమ య్యే వారిని గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామాలు ప్రశాంతంగా కొనసాగేలా ప్రజలను సమాయత్తం చేయాలి అని పేర్కొ న్నారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాల న్నారు.

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ (miryalaguda)డిఎస్పీ రాజశేఖర రాజు, ఎస్బి సిఐ రాఘవరావు, శాలిగౌరారం సిఐ శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు, 2 టౌన్ సిఐ నాగార్జున,1 టౌన్ సిఐ సుధాకర్ ఎస్సైలు పోలీస్ సిబ్బంది( police officer)తదితరులు పాల్గొన్నారు.