— నల్లగొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్
SP Sharat Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసు కోవాలని, పెండింగ్ కేసులను త్వరి తంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసు ల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ అధికారుల ను ఆదేశించారు.జిల్లా పోలీస్ కా ర్యాలయంలో గురువారం పోలీసు అధికారుల తో నిర్వహించిన నెల వారి నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసు లలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురిం చి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కే సులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలన్నా రు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలం కు షంగా పరిశోధన చేసి ఫైనల్ చేయా లన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరి తగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కో ర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి సి.సి.టి. యన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయ మూర్తులను స్వయంగా కలిసి కేసు ల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకా లంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటి ని పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని,పెండింగ్ కేసుల విషయం లో నిరంతర పర్యవేక్షణ ఉంటుంద ని, కొత్త కేసులతో పాటు చాలా కా లంగా పెండింగ్ కేసులను ఎప్పటిక ప్పుడు సమీక్షించడం ద్వారా కేసు ల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థా యిల అధికారులు పని చేయా లన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకుంటూ ప్రజలకు అందుబాటు లో ఉంటూ సంవర్దవంతమైన సేవ లు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. గ్రామ పోలీసు అధికారులు ప్రతీ రో జు గ్రామానికి సందర్శించి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణ కు కృషి చేయాలని అన్నారు. క మ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామా లలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవ గాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరో సా కల్పిస్తూ వారి ప్రజా రక్షణ ప్రధా న ధ్యేయంగా నాణ్యమైన,సత్వర సేవలు అందించాన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియో గంపై విద్యార్థులు, ప్రజలకు అవగా హన కల్పించాలని సూచించారు.
విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనా లు జరగకుండా పాత నేరస్తుల కద లికలపై నిఘా ఉంచాలన్నారు. ఫి ర్యాదుదారులతో మర్యాదపూర్వ కంగా వ్యవహరించాలని, వారి ఫి ర్యాదులను స్వీకరించి జవాబుదా రీగా ఉండాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వ హించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడు పుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించా లని అన్నారు. అసాంఘిక కార్యక లాపాలు గంజాయి, జూదం, పి.డి. యస్ రవాణా లాంటి వాటిపై ప్ర త్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుం దన్నారు. రిపీటెడ్ గా ఇలాంటి నే రాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ ను నమోదు చేస్తామని హెచ్చరిం చారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అడిషనల్ ఎస్పీ రమేష్,నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు,సైబర్ క్రై మ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సి.ఐ లు మరియు యస్.ఐలు పాల్గొన్నా రు.