Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP T. Srinivasa Rao: ఆపరేషన్ ముష్కాన్ దాడుల్లో 18 మంది చిన్నారులకు విముక్తి

–18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు
–జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

SP T. Srinivasa Rao: ప్రజా దీవెన, గద్వాల: సమాజంలో ని బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిం చడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ (Operation Smile, Operation Muskan) అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి విముక్తి కల్పించడం జరిగిందని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు తెలి పారు. తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా, వెట్టి చాకిరి చేస్తున్న చిన్నారులను గుర్తించి విముక్తి కలిగించేలా కార్యక్ర మాలు నిర్వహించడం జరుగుతుం దని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్-X విజయవం తం అయిందన్నారు.

చిన్నారులకు విముక్తి (Emancipation of children)కల్పించడం కోసం పోలీస్ శాఖ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెం ట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారులతో జిల్లాలో టీమ్లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థల సహకారంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ సం వత్సరం జులై 1 నుండి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలో జిల్లా వ్యాప్తంగా 18( బాలలు -11, బాలికలు-7) మంది చిన్నారులను గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని అందులో 11 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయడం జరిగిందనీ, ముగ్గురు ఓనర్ లకు లేబర్ డిపార్ట్మెంట్ (Department of Labor)వారు జరిమానాలు విధించడం జరిగిందనీ అన్నారు. విముక్తి పొందిన చిన్నారులు తిరిగి చదువుకునేల చైల్డ్ డిపార్ట్మెంట్(Child Department)వారు కృ షి చేయడం జరుగుతుం దని ఎస్పీ తెలిపారు. బాలల హక్కు లను కాపాడాల్సిన బాధ్యత మానం దరిపైనా ఉన్నదని,బాల కార్మిక వ్య వస్థ నిర్ములన కోసం బాధ్యతాయు తంగా కృషి చేయాలని కోరారు. తరుచు బాలల చేత పనులు చేయి స్తున్న వారిని గుర్తించి వారిపై కేసు లు నమోదు చేయడం జరుగుతుం దన్నారు.వీధి బాలలను, బాల కార్మి కులను చూసినప్పుడు, డయల్- 100 లేదా 1098 లేదా స్థానిక పోలీ స్ వారికి సమాచారం అందిం చాల ని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.