— టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
School Sanitation : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని పాఠశాలల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పాఠశాల పరిశుభ్రత,మధ్యాహ్న భో జన పథకం అమలు, తదితర అం శాలపై జిల్లా, మండల స్థాయి అధి కారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు.
పాఠశాలలు పునః ప్రారంభం కావ డం ,అలాగే వర్షాకాలం ప్రారంభ మైన దృష్ట్యా పాఠశాలల్లో పరిశుభ్ర త లోపం కారణంగా విద్యార్థులు ఇ బ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి జిల్లాలో ని అన్ని పాఠశాలలు ,అంగన్వాడీ కేంద్రాలు ,హాస్టళ్లలో పరిశుభ్రత లో పం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల గదులు, ఆ వరణ, వంటగది, టాయ్లెట్లు అన్ని శుభ్రంగా ఉంచాలని,పాఠశాల ఆవ రణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, ఎక్కడైనా వాన నీరు నిలిచి ఉండేందుకు ఆస్కారం ఉంటే గుర్తించి తక్షణమే సులభంగా వాన నీరు వెళ్లే మార్గం చేయాలని, అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు
శుభ్రంగా ఉండేలా చూడాలని, మురుగు నీరు సులభంగా మురికి కాలువలోకి వెళ్లేలా చూడాలని చె ప్పారు.
విద్యార్థులుపాము ,తేలు కాటు కు గురికాకుండా తక్షణ చర్యలు చేప ట్టాలని ఆదేశించారు. అన్ని పాఠ శాలల్లో బ్లీచింగ్ పౌడర్ తో పాటు, గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించాల ని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ను ఆదేశించారు. రెండు వారాలలో వీటన్నింటిని పూర్తి చే యాలని అన్నారు.కేవలం విద్యాశా ఖ ద్వారా మాత్రమే ఈ పనులన్నీ చేయడం కష్టమని, అందువల్ల
మండలాల ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలని, గ్రామ పంచా యతీ కార్యదర్శులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. పాఠశాల ల పరిశుభ్రత విషయమై మండల ప్రత్యేక అధికారులు తక్షణమే వారి పరిధిలో సమావేశాలు నిర్వహించా లని ,అలాగే అన్ని పాఠశాలలు , హా స్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను తని ఖీ చేయాలని, ఎక్కడైనా వర్షం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొ న్నా లేదా పాము ,తేలు కాటు వం టివాటికి గురైతే సంబంధిత ఎం ఎ స్ ఓ ,ఎం పి ఓ, పంచాయతీ కార్య దర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని హెచ్చరిం చారు.
ప్రత్యేక అధికారులు పాఠశాలలు, హాస్టళ్లలో బస చేయాలని , మహి ళాధికారులు బాలికల పాఠశాలల్లో బస చేయాలని,పాఠశాల పరిశుభ్ర తలో ఎంపీడీవోలు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని చెప్పా రు. మధ్యాహ్న భోజన పథకం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎక్కడా పాడైపోయిన బియ్యం, కూ రగాయలతో భోజనాన్ని తయారు చేయవద్దని, వంటగదిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఎక్కడై నా పారిశుద్ధ్య సమస్య తలెత్తిన ట్లయితే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అలాగే పాఠ శాలలోని అన్ని మూత్రశాలలు శు భ్రంగా ఉండేలా చర్య లు తీసుకో వాలన్నారు.స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్, మి ర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయ ణ్ అమిత్ , రెవిన్యూ అదనపు కలె క్టర్ జె. శ్రీని వాస్ ఎమ్ ఎస్ వో లు, ఇతర అధి కారులు, తదితరులు, ఈ టెలీ కాన్ఫ రెన్స్ కు హాజరయ్యారు.