Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SR Sankaran: ఘనంగా ఎస్ఆర్ శంకరన్ జయంతి వేడుకలు

SR Sankaran: ప్రజా దీవెన,కోదాడ: గురుకుల పాఠశాలల సిద్ధాంత కర్త,భారత పౌర సేవకుడు సామాజిక కార్యకర్త ఎస్ ఆర్ శంకరన్ (SR Sankaran) జయంతి వేడుకలను స్పారోస్ నెట్ వర్క్ (Sparrows Network)ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా స్పారోస్ ఇంటర్నేషనల్ సీప్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య (SEAP Convenor Balguri Durgaiah,), జీఎస్టీ ఉద్యోగి సీనియర్ స్పారోస్ రవీంద్రబాబు లు పాల్గొని ఎస్ఆర్ శంకరన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎస్సార్ శంకరం జయంతి రోజు స్వేరోస్ నెట్వర్క్ స్థాపించడం జరిగిందని శంకరం ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాలని అన్నారు.

ఎస్ ఆర్ శంకరన్ (SR Sankaran) ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. స్వేరోస్ నెట్ వర్కు (Severos Network)ఆధ్వర్యంలో ఎస్ ఆర్ శంకరన్ జయంతి వేడుకలను చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ (Senior IAS Officer)అయిన ఎస్ఆర్ శంకరన్ ఆయన మరణం అనంతరం ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా ఉండటం ఆయన అణగారిన వర్గాల కోసం చేసిన సేవలే దీనికి నిదర్శనమని తెలిపారు.శంకరన్ బడుగు బలహీన వర్గాలకు చేసిన కార్యక్రమాలను చూసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శంకరం జన్మదిన పురస్కరించుకొని అక్షరం,ఆర్థికం,ఆయుధం అనే నినాదంతో స్వేరోస్ నెట్ వర్క్ ను స్థాపించి ఎంతో మందిని ఉన్నత పౌరులుగా స్వేరోస్ నెట్ వర్క్ ద్వారా తీర్చిదిద్దారని అన్నారు.ఈ కార్యక్రమంలో మంద శ్రీను,శిల్పి సుధాకర్,చెడపంగు నాగార్జున,పాముల రాకేష్,చింత్రియాల అన్వేష్,చిరంజీవి,జ్యోతిరాణి,విజయ్,ఏసోబు,సంపత్,మనీ తదితరులు పాల్గొన్నారు