Lakshmi Narasimha Swamy Jayanti : శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి
–శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ, ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ
Lakshmi Narasimha Swamy Jayanti :ప్రజాదీవెన, సూర్యాపేట :శ్రీశ్రీశ్రీ ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, ఉండ్రుగొండ గిరిదుర్గ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మే 10నుంచి మే 12, వరకు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహోత్సవాలను జయప్రదం చేయాలని శ్రీశ్రీశ్రీ ఉండ్రుగొండ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చకిలం కృష్ణకుమార్, వ్యవస్థాపక అధ్యక్షులు, ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు ఆదూర్తి రామయ్య లు కోరారు. జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవస్థానంలో శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ ఉ0డ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ, ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు.
10 శనివారం సాయంత్రం 5 గంటలకు సంతోషిమాత దేవస్థానం నుంచి నగర సంకీర్తన, శోభాయాత్ర ప్రారంభమయి 11 న నరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు, సాయంత్రం 5 గంటలకు స్తంభోద్భవ స్తోత్ర పారాయణం, రాత్రి 8 గంటలకు వెన్నల కాంతిలో కళ్యాణోత్సవం,
12 సోమవారం వైశాఖ పూర్ణిమ సందర్భముగా ఉదయం 10 గంటలకు శ్రీ సుదర్శన సహిత లక్ష్మీనరసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి బంధకవి కృష్ణమోహన్, ఉండ్రుగొండ
గిరిదుర్గ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి మహేశ్వరం రవిచంద్ర, ఉపాధ్యక్షులు రాచర్ల కమలాకర్, చల్లా లక్ష్మీకాంత్,సభ్యులు చకిలం వెంకటేశ్వర్లు, గుండా శ్రీనివాస్, నూక వెంకటేశం గుప్తా, గోపారపు రాజు, దేవరశెట్టి సోమయ్య, పబ్బ ప్రకాష్, అబ్బురి వినోద్ తదితరులు పాల్గొన్నారు..