Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srikanth : గోడ పత్రిక ఆవిష్కరణ

వెలగొంతులు లక్ష డబ్బులు

మహాప్రదర్శన ను విజయవంతం చేయాలి: శ్రీకాంత్

Srikanth : ప్రజా దీవెన, కోదాడ: ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాదులో నిర్వహించే వేల గొంతులు లక్ష డప్పుల మహా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాదిగ జర్నలిస్టులంతా తరలిరావాలని కోదాడ నియోజకవర్గ ఎం జె ఎఫ్ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ అన్నారు మహా ప్రదర్శన కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించి అయన మాట్లాడారు .

పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగేబోయే లక్ష డబ్బులు
వేల గొంతుకలు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కానీ విని ఎరుగని రీతిలో హైదరాబాద్ నగరంలో జరిగే మహా సాంస్కృతిక ప్రదర్శనను జయప్రదం చేయడం కోసం మాదిగ మరియు ఉప కులాల ప్రజలు డప్పు సంకనేసుకుని ప్రతి గ్రామం నుండి ఒక బస్సు తీసుకుని కోదాడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు .

కార్యక్రమంలో ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు,బంక వెంకటరత్నం గౌవర సలహాదారులు పిడమర్తి గాంధీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి నాగరాజు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తామలపాకుల లక్ష్మీనారాయణ ,నియోజకవర్గ ఉపాధ్యక్షులు చీమ చంద్రశేఖర్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు ఏపూరి సునీల్ రత్నాకర్ పాల్గొన్నారు