Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srinivas Yadav : సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

— సంక్రాంతి వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Srinivas Yadav : ప్రజా దీవెన, హైదరాబాద్: మన సంస్కృతి, పండుగలు ఎంతో గొప్పవని, వాటిని పరిరక్షించుకో వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్ అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం నెక్లెస్ రోడ్ (PV మార్గ్) లోని పీపుల్స్ ప్లాజా లో సంక్రాంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటలు, పొట్టేళ్ల పొట్లాట లు ఆకట్టుకున్నాయి. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్ పేట MLA కాలేరు వెంకటేష్, తన మనువడు, మనువరాళ్లతో కలిసి పతంగులు (కైట్) లను ఎగురవేశారు. చిన్నారులకు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కైట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మన ఆచారాలు, సాంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. విదేశీయులు సైతం మన ఆచారాలు పాటిస్తున్నారంటే వాటికి ఎంతటి విశిష్టత ఉందో అర్ధం అవుతుందని అన్నారు. వాటిని మన పూర్వీకులు పరిరక్షించి మనకు ఇచ్చారని, మనం వాటిని గౌరవించి ఆచరించాలని చెప్పారు.

 

 

ప్రస్తుత జనరేషన్ లోని యువత, విద్యార్థులకు చాలా మందికి వాటి విశిష్టత తెలవకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఎంతో గొప్పగా, ఘనంగా జరిగేవని, నేడు ఆ సందడి కనిపించడం లేదన్నారు. వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడి మన సంస్కృతి సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేయడమే కారణంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మన పండుగలు, సాంప్రదాయాల విశిష్టతను తెలియజేయడం ద్వారా వాటి పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాంపల్లి నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి ఆనంద్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, BRS పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, శ్రీహరి కిషోర్, బాలరాజ్ యాదవ్, లక్ష్మీపతి, శైలేందర్, మహేష్ కుమార్ యాదవ్, BC కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.