Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srinivasa Rao : ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు

–డబ్బులు పోయాక బాధపడడం వృదాప్రయాస

–అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి

—– గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

Srinivasa Rao :ప్రజా దీవెన, గద్వాల: “విలాసవంతమైన వస్తువులిస్తా మని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామ ని,విదేశీ యాత్రలకు పంపుతా మని, రక రకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజల నుండి మొదట గా సభ్యత్వాలను స్వీకరించి, వారి తో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పి స్తే అంత అధిక మొత్తంలో డబ్బు లు తిరిగొస్తాయని నమ్మించి ప్రజ ల్ని మభ్యపెట్టే కొత్త కొత్త టెక్నిక్ ల తో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని ,ఇలాంటి నూతన స్కీం ల పట్ల, నేరగాళ్ల పట్ల ప్రజ లందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందనీ జిల్లా ఎస్పీ టి శ్రీని వాస రావు జిల్లా ప్రజలకు సూచిం చారు.ప్రస్తుతo సైబర్ నేరాలు జ రుగుతున్న తీరు,సైబర్ నేరాలకు ప్రజలు గురైతున్న విధానం , ప్రజ లు సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవశ్యకత గురిం చి ఒక ప్రకటన ద్వారా తెలియజే శారు. మొబైల్ కు లేదా సోషల్ మీ డియా ఫ్లాట్ ఫాం అయినా face book, Instragram , teligram, ట్విట్టర్ అకౌంట్ వినియోగదారులకు

1. Coasta Earning App,

2.pyramid scheme
3.Adidas
4. Yamaha make waves

5. LFL

6. VC COFFEEIN

పేర్లతో లింక్ ద్వారా ఫైల్ వస్తుందని దానిని ఇంస్టాల్ చేసుకున్నాక అప్లికేషన్ లో రిజిస్టర్ అయిన తరువాత ఒక వాట్సాప్ గ్రూపు కు యడ్ చేస్తా రని , వారు అంతకు ముందు పెట్టి నా ఎన్వెస్ట్మెంట్, వచ్చినా ప్రాఫిట్ కు సంబంధించిన నకిలీ పత్రాలను గ్రూపు లో షేర్ చెయ్యగా వాటిని నమ్మీ మొబైల్ వినియోగ దారులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంద ని , మొదట చిన్నా చిన్న అమౌంట్ కు లాభాలు వెంటనే ఇస్తారని, ఎక్కువ అమౌంట్ పెట్టాక రెస్పాండ్ కారని, అలాగే ఇంకో విధానంలో నెక్ట్ లెవెల్ అంటూ ఎక్కువ అమౌం ట్ తో ఎక్కువ సంఖ్యలో ఒకరి క్రిం ద ఒకరిని జాయినింగ్ చెపిస్తూ, వీక్ ఎండ్ లలో సక్సెస్ మీటింగ్ లు పెడుతూ ఎక్కువ మందిని జాయి న్ చేపించిన వారిని సత్కరిస్తూ మరింత ఎక్కువ మందిని జాయిన్ చేసేలా ప్రోత్సహిస్తారని , ఎక్కవ సంఖ్యలో ప్రజలు జాయిన్ అయి భారీగా పెట్టుబడులు పెట్టాక ఒకే సారి కంపని ఎత్తేస్తారని, ప్రజలు ఒక్క ముఖ్య విషయం గుర్తుం చుకోండి, ఎవరూ ముఖ్యంగా మన కు ఎటువంటి సంబంధం లేని వా ళ్ళు మనకు ఏ విధమైన ఆర్థిక ప్ర యోజనం ఊరికే చెయ్యరు. మన ల్ని నమ్మించి, మభ్యపెట్టి, వంచించి మన దగ్గరి, మన ద్వారా మరికొంద రి కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే వారి పని.

 

 

మన ఆశ, అత్యాశ వారి ఆయుధాలు కాబట్టి ఇలాంటి నేరా ల పట్ల, మొబైల్ ఫోన్లను చూసే మనకు Face book, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఈమెయిల్, ఫోన్ కాల్ ల ద్వారా మీ దృష్టిని ఆకర్షించే ఈ కు ట్రలకు ఎట్టిపరిస్థితుల్లో లొంగకండి, తొందరపడి బాధలను, నష్టాలను కొని తెచ్చుకోకండి. ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలను తీసుకున్నా కూడా మోసపోయిన పక్షంలో ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్ కి గానీ, www.cybercrime.gov.in ద్వారా కానీ లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ లో నైనా వెంటనే పూర్తి వివరాలతో పిర్యాదు చెయ్యాలని. ఆలస్యం విషం, అత్యాశ కొంప ముంచుతుందనే నానుడి మాటలను మనసా వాచా కర్మణా నమ్మండని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలను జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పె క్టర్ రాజు ఎప్పటికప్పుడు పర్యవే క్షిస్తూ బాధితులు వెoటనే పోలీస్ స్టేషన్ లలో సైబర్ వారియర్స్ ను కలిసేలా చేసి సంబంధిత బ్యాంకు వారితో మాట్లాడి అమాంట్ ను హోల్డింగ్ చెపించడం, గ్రామాలలో సైబర్ వారియర్స్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగు తుందన్నారు.