— రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్
State Panchayat Raj : ప్రజా దీవెన నల్లగొండ: ధాన్యం కొనుగోలు, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర కార్య క్రమాల వల్ల స్వయం సహాయక మ హిళా సంఘాలు ఆర్థికంగా మరిం త బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్య దర్శి లోకేష్ కుమార్ అన్నారు.
గురువారం ఆయన హైదరాబాద్ నుండి సెర్ఫ్ సీఈఓ దివ్య తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్డిఓ,సెర్ఫ్ అధికారులతో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఐ కె పి ద్వారా రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరింత పెంచాలని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా ఐకెపి మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న కమిషన్ ను సమీక్షించాలని, కమిషన్ మొత్తాన్ని 10% జిల్లా సమాఖ్యలు, 90% గ్రామ సమస్యలకు వెళ్లే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగుల సమీకరణ చేయాలని , భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో మహిళ సంఘాల ద్వారా గోడౌన్లతో పాటు, రైస్ మిల్లుల ఏర్పాటు వంటివి ఆలోచిస్తున్నందున ధాన్యం కొనుగోలులో స్వయం సహాయక మహిళా సంఘాలు చురుకుగా పాల్గొనేలా చూడాలన్నారు.
యుడిఐడి నంబర్లు , సదరం క్యాంపుల నిర్వహణకు సంబంధించి స్లాట్ పెండింగ్లో ఉన్న జిల్లాలు తక్షణమే స్లాట్ ఇవ్వాలని, సదరం క్యాంపుల నిర్వహణకు ఆసుపత్రులలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపించాలని, సదరం క్యాంపులు డేటా ను ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు మంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సదరం క్యాంపుల లో మౌలిక సదుపాయాలతో పాటు, పౌర సదుపాయాలను పెంచాలన్నారు.
వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి చనిపోయిన వారి పేర్లను జాబితాలో తీసివేయడం భాగస్వామికి అర్హత ఉన్నట్లయితే పెన్షన్ మంజూరి చేయడం, ఒక కుటుంబంలో ఒకరికే వృద్ధాప్య పింఛన్ ఉండేలా చూడడం, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం వంటివి ఎంపీడీవోల ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. చనిపోయిన కేసుల విషయంలో పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే నిర్ధారణకు రావాలన్నారు.
స్వయం సహాయక మహిళా సంఘాలు ద్వారా పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ తో పాటు,వారి ఆదాయ మార్గాలు పెంచుకునే విధంగా ప్రైవేట్ ఆర్డర్లపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రత్యేకించి యూనిఫామ్స్ కుట్టడానికి రాష్ట్ర స్థాయిలో ఆరుగురు మాస్టర్ ట్రైనర్లను గుర్తించడం జరిగిందని వీరు మండల స్థాయి లో ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా ప్రతి జిల్లా , నియోజక వర్గ, మండల కేంద్రా లలో పెట్రోల్ బంక్ లను నిర్వ హించాలని ఆలోచిస్తున్నందున జిల్లా స్థాయిలో పెట్రోల్ బంక్ ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించినట్టే, మండల, నియోజకవర్గాల స్థాయి లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఈ పెట్రోల్ బంకుల వద్ద రెస్టా రెంట్ , మాల్స్ నిర్వహించాలని, భవిష్య త్తులో ఇందిరా మహిళా శక్తి బజార్ వంటి వాటిని నిర్వహించేందుకు ఆస్కారం ఉందన్నారు . సాధారణ జీవిత బీమా, ప్రమాద బీమా ల పై ఆయన సమీక్షించారు. సర్ఫ్ సీఈ వో దివ్య వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు సూచ నలు, సలహాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి, అద నపు కలెక్టర్ జె. శ్రీనివా స్ ,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,తదిత రులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజర య్యారు.