Stop Rape: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నానాటికి మహిళలపై అఘాయిత్యాలు పెరి గిపోతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒకమూలన లైంగికదాడి ఘటలు లేదా హత్యలు వెలుగులోకి వస్తూ నే ఉన్నాయి. తాజాగా హైదరాబా ద్ పరిధిలో మరో దారుణం చేసు కుంది. ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యు వకుడు లైంగికదాడికి యత్నించా డు. అతన్ని ప్రతిఘటించిన బాధి ,తురాలు కదులుతున్న రైలులో నుంచి కిందికి దూకేసింది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో మేడ్చల్కు బయలుదేరింది. మహిళల కోచ్లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. దీంతో బోగీలో ఆమె ఒక్కతే అయిపోయింది. గుర్తించిన ఓ యువకుడు (25) ఆమెపై అఘా యిత్యానికి ప్రయత్నించాడు. దీం తో అతడి నుంచి తప్పించుకునే క్ర మంలో బాధితురాలు కొంపల్లి సమీ పంలో రైలు నుంచి బయటకు దూ కింది. దీంతో ఆమెకు తీవ్రంగా గా యాలయ్యాయి. స్థానికుల సమా చారంతో ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు యువతిని గాంధీ ఆ సుపత్రికి తరలించారు. కేసు నమో దుచేసిన పోలీసులు దర్యాప్తు చే స్తున్నారు. దుండగుడి కోసం ప్రత్యే క బృందాలు గాలిస్తున్నాయి.