Students Honor Teachers :ప్రజా దీవెన, నార్కట్ పల్లి: నల్లగొం డ జిల్లా నార్కట్ పల్లి మండలం లోని ఎల్లారెడ్డిగూడెం గ్రామం జెడ్పి హెచ్ఎస్ పాఠశాలలో ఇటీవల వె లువడిన పదవతరగతి ఫలితాల లో హరిదీప్ అనే విద్యార్థి 600 మార్కులకు గాను 540 మార్కులు సాధించి నార్కట్ పల్లి మండలం లోనే టాపర్ గా నిలిచాడు. అదేవి ధంగా పాఠశాలలో 23 మంది అ భ్యర్థులు పరీక్ష హాజరు కాగా 20 మంది విద్యార్థులు మంచి మార్కు లతో పాస్ కావడం జరిగింది.
ఈ క్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యా యురాలు హిమజ విద్యా ర్థులను అభినందించి శాలువాలతో ఘనం గా సత్కరించారు. విద్యార్థి హరిదీ ప్ మాట్లాడుతూ తన పాఠ శాల ఉపాద్యాయుల భోధనాశైలి, కృషి వ ల్లనే తాము ఈ మార్కులు సాధిం చగలిగామని అన్నారు.
భవిష్యత్ లో సివిల్స్ సాధించి కలెక్టర్ కావడ మే తన లక్ష్యం అని టాపర్ విద్యా ర్ది పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు హిందుజా, సీనియ ర్ ఉపాద్యాయు లు వోలి సమీర్ కుమార్ లు మాట్లాడుతూ నిరం తరం పాఠశాల ఉపాద్యాలందరం సమిష్టిగా ప్రతిఒక్క విద్యార్థిపై ప్ర త్యేక శ్రద్ధ వహించి ప్రణాళికా ప్రకా రం బోధన చేశామని దాని ఫలిత మే నేడు హరిదీప్ నార్కట్ పల్లి మండలం టాపర్ గా నిలిచారన్నా రు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపా ధ్యాయులు, విద్యా ర్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.