ప్రజా దీవెన, కోదాడ:యువత వ్యాపార రంగంలో రాణించాలని కోదాడ ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు కారింగుల అంజి గౌడ్ అన్నారు ఆదివారం పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు లో చలిగంటి రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్ ఆర్ కార్ వాషింగ్ హోమ్ కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వారి స్వశక్తితో వారి కాళ్ళ మీద నిలబడి స్వయం ఉపాధి కల్పించుకోవాలని తెలిపారు.
స్వయం ఉపాధి ద్వారా పదిమందికి యువకులకు
ఉపాధి కల్పించవచ్ఛని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను షాపు నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, శ్రీరామ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.