Suicide: ప్రజా దీవెన జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ముందు వెనుక చూడకుండా ఆ తల్లి క్షణికావేశం ఆమెతో పాటు ఇద్దరు పిల్లల ప్రా ణాలను బలి తీసుకుంది. భర్తపై కోపంతో పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. తల్లి రెండు రోజుల క్రితం మృతి చెంద గా ముక్కుపచ్చలారని ఇద్దరు చి న్నారులు ఆసుపత్రిలో మృత్యు వుతో పోరాడి ఆదివారం ప్రాణాలు వదిలారు. ముగ్గురు మృతితో జగి త్యాల జిల్లా మద్దులపల్లిలో విషా ద ఛాయలు అలుముకున్నాయి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండ లం మద్దులపల్లిలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసు కోవడం కలకలం సృష్టిస్తుంది. కంబాల హారిక భర్త తిరుపతిపై కో పంతో తొమ్మిదేళ్ళ కొడుకు కృ ష్ణాంత్, 8 ఏళ్ళ కూతురు మాయం తలక్ష్మి కి ఈనెల 14న సాయంత్రం గడ్డి మందు తాగించి తాను తాగి ఆత్మహత్య చేసుకుంది. హారిక 14న రాత్రి జగిత్యాల ఆసుపత్రిలో మృతి చెందడం, ఇద్దరు పిల్లలు ప్రా ణాపాయ స్థితిలో ఉండగా హైద రాబాద్ కు తరలించారు. ఆసు పత్రిలో చికిత్స పొందుతూ ఆది వారం ప్రాణాలు కోల్పోయారు.
త ల్లి ఇద్దరు పిల్లల మృతికి భర్త తిరు పతే కారణమని హారిక పుట్టిం టివారు ఆరోపిస్తూ పోలీసులకు పిర్యాదు చేశారు. ఒగ్గు కళాకారు డు అయిన తిరుపతికి మరో మ హిళతో అక్రమ సంబంధం ఉందని హారిక కుటుంబ సభ్యులు ఆరోపి స్తున్నారు. 12 ఏళ్ల క్రితం తిరుపతి హారికకు వివాహం కాగ ఇద్దరు పిల్ల లు పుట్టాక వరకట్నం కోసం వేధిం చడంతోపాటు మరో మహిళను ఇంటిదాకా తీసుకురావడంతోనే మనస్తాపం చెంది భర్తకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు పుట్టింటివారు తెలిపారు. హారిక ఇ ద్దరు పిల్లల మృతికి కిరణమైన భ ర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొకరికి ఇ లాంటి అన్యాయం జరగకుండా చ ర్యలు ఉండాలని హారిక సోదరు డు, మరదలు విజ్ఞప్తి చేశారు.
భార్య ఇద్దరు పిల్లలు మృతితో ఇక తానెందుకు బతకాలని బోరున వి లపించాడు భర్త తిరుపతి. హారిక పుట్టింటి వారు ఫిర్యాదు మేరకు పె గడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు ముం దు వీడియో కాల్ లో హారిక భర్త తిరుపతి తో మాట్లాడి సూసైడ్ చే సుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలపడంతో హారిక తిరుపతి సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.భర్త వరకట్న వేదింపు లు అక్రమ సంబంధమే ఆత్మ హ త్యకు కారణమని హారిక పుట్టిం టివారి పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.