Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suicide Student : విషాదం, మరో విద్యార్థి ఆత్మార్పణ

Suicide Student : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ ఉప్పల్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పిఎస్ పరిధిలో న్యూ భరత్ నగర్ సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదు వుతున్న విద్యార్ధి సంగారెడ్డి స్కూ లు నాలుగు అంతస్తుల బిల్డింగ్ టె ర్రర్ నుండి దూకి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. బిల్డింగ్ పై నుండి వి ద్యార్థి పడటంతో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే విద్యార్థిని మరణించిన ట్లు తెలిపిన వైద్యులు నిర్ధారించా రు. స్కూల్ యాజమా న్యం హుటా హుటిన గాంధీ ఆస్పత్రికి తరలించ గా అప్పటికే మరణించాడు. విద్యా ర్థి సంగారెడ్డి, బోడుప్పల్ ద్వారకా నగర్ కి చెందిన ధర్మారెడ్డి కొడు కుగా కాగా విద్యార్థి సంగారెడ్డి మృ తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు స్కూల్ వద్దకు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సీసీటీవీ కెమెరా పనిచేయక పోవడంతో పలు అను మానాలు వ్యక్త అవుతున్నాయి.

బొడుప్పల్, ద్వారాకపురి కాలనీలో ఉండే ధర్మారెడ్డి సంగీత దంపతు లకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బీటెక్ చదువు తుoడగా రెండో కుమారుడు సంగా రెడ్డి సాగర్ గ్రామర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయి తే పిటి సార్ ఆంజనేయులు వేధిం పుల కారణంగానే విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.