Suicide : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ రాయదుర్గం పీఎస్ పరి ధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మ హ త్యకు పాల్పడింది. ఆరు నెలల క్రితం గోవాలో వివాహం చేసుకున్న దేవిక (35), సతీష్ రాయదుర్గం పీఎస్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటు ఇరువురు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఆదివారం అర్ధ రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరివే సుకొని దేవిక ఆత్మహత్యకు పాల్పడింది.
సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మ హత్యకు పాల్పడినట్టు గుర్తించిన భర్త సతీష్ పోలీసులకు, దేవిక కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. భార్యాభర్తల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కార ణంగా తెలుస్తుంది. భర్త వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహ త్యకు కారణమనిదేవిక తల్లి రా మలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం ఉస్మానియా ఆసు పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాయ దుర్గం పోలీసులు.